Homeఅంతర్జాతీయంMunir lobbying with America: దిగజారిన మునీర్‌.. బయటపడిన అమెరికాతో లాబీయింగ్!

Munir lobbying with America: దిగజారిన మునీర్‌.. బయటపడిన అమెరికాతో లాబీయింగ్!

Munir lobbying with America: గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌ ప్రతిదాడులను తిప్పికొట్టింది. అయితే మన దాడికి వణికిపోయిన పాకిస్తాన్‌ అమెరికాతో చేసిన లాబీయింగ్‌ ఇప్పుడు బయటపడింది. ఇది పాకిస్తాన్‌ బలహీనతకు ప్రత్యక్ష సాక్ష్యం.

పకడ్బందీ లాబీయింగ్‌..
అమెరికా చొరవతోనే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోయిందని, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్‌ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ తాజాగా ప్రకటించారు. ప్రాంతీయ శాంతి కోసమే పాకిస్తాన్‌ ఇందుకు అంగీకరించిందని వెల్లడించాడు. కానీ యూఎస్‌ ఫారిన్‌ ఏజెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ఫెరా(FARA) పత్రాలు ఈ ప్రకటనను డొల్లుగా మార్చాయి. నిజం ఏమిటంటే.. పాకిస్తాన్‌ అమెరికా సాయం కోసం 60 సార్లకుపైగా లాబీయింగ్‌ చేసింది. ఇది దౌత్య విజయం కాదు, దౌత్య బలహీనతకు నిదర్శనం.

30 సార్లు సంప్రదింపులు..
మే 6 అర్ధరాత్రి భారత్‌ సైనిక దాడులతో షాక్‌ అయిన పాకిస్తాన్‌ అమెరికాతో సుమారు 30 సార్లు వేర్వేరుగా సంప్రదింపులు చేపట్టింది. పాక్‌ అంబాసిడర్‌ అమెరికా నేతలతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేసింది. మే 7–8న ఉద్రిక్తతలపై చర్చించేందుకు లాబీయింగ్‌ చేసింది. మే 9న లాబీయింగ్‌ను మరింత పెంచి, రక్షణ, జాతీయ భద్రత వ్యక్తులతో 20–25సార్లు సంప్రదించింది. అమెరికా మీడియా జర్నలిస్టులతో భేటీలు జరిపింది.

సైనిక దెబ్బకు బలహీనపడిన పాక్‌
భారత్‌ సైనిక చర్యలకు పాక్‌ ఎంతగా భయపడిందో లాబీయింగ్‌ పరిమితి నుంచి స్పష్టమవుతోంది. మొత్తం 50సార్లకుపైగా అమెరికాను సంప్రదించడం, 60 మంది అధికారులను సంచరించడం నిదర్శం.

దౌత్య వ్యూహాల్లో తేడా..
వాషింగ్‌టన్‌లో భారత్, పాక్‌ కార్యకలాపాలకు పూర్తి వ్యత్యాసం కనిపించింది. ఉగ్రవాదాన్ని ఖండించడం, పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం. మూడో పక్షం జోక్యాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌ తొలి నుంచే వస్తోంది. పాకిస్తాన్‌ మాత్రం అమెరికా మద్దతు కోరడం, మధ్యవర్తిత్వం కోరడం, కశ్మీర్‌ను అంతర్జాతీయత చేయడం. ఇదే రెండు దేశాల మధ్య తేడా.

బలహీనతకు లొంగిపోవడం
పాక్‌ ప్రకటనలు ‘ప్రాంతీయ శాంతి కోసం‘ అని చెప్తున్నాయి. కానీ నిజం మరొకటి: ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు కంగుతిన్న పాక్‌ చివరకు కాళ్లబేరానికి వచ్చింది. ఈ పరిస్థితిలోనే భారత్‌ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇది భారత్‌ బలహీనత కాదు. ఇది భారత్‌ దౌత్య విజయం.

కచ్చితమైన దాడులు..
ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సైనిక సమర్థతను చాటింది: ఇచ్చిన పనిని పర్ఫెక్ట్‌గా పూర్తి చేశాం. పీవోకేసహా పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రకేంద్రాలను కకావికలం చేసి పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది.

ఆసిమ్‌ మునీర్‌ ప్రకటనలు డొల్లు అని తేలిపోయాయి. పాక్‌ ఎంతగా దిగజారిపోయిందనే విషయం వెలుగు చూసింది. 60సార్లకుపైగా లాబీయింగ్‌ చేయడం బలహీనతకు లక్షణం. ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం సైనిక విజయం కాదు, దౌత్య విజయం కూడా.. భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్‌ మెడలు వంచింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular