spot_img
Homeఅంతర్జాతీయంPM Modi US Tour : మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. అమెరికా నుంచే...

PM Modi US Tour : మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. అమెరికా నుంచే పాక్ కు ప్రధాని గట్టి హెచ్చరిక

PM Modi US Tour : ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలే పంపారు. దశాబ్దాలు గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. దయాది దేశం పాకిస్తాన్ కు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. ప్రపంచలో అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థంగా భారత్ మారబోతోందని గుర్తుచేశారు. 9/11, 26/11 దాడుల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, దాని పర్యవసానాలు గురించి వివరించారు. ప్రధాని ప్రసంగానికి సభికులు కరతాళ ధ్వనులతో తమ అభినందనలు తెలిపారు.

అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభిస్తోంది. అక్కడి ప్రవాస భారతీయులు మోదీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జాతీయ జెండాలను చేతబట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అటు వైట్ హౌస్ లో మోదీకి ఆత్మయ సత్కారం లభించింది. అధ్యక్షుడు జో బైడన్ తో దైపాక్షిక చర్చలు సానుకూలంగా సాగాయి. భద్రత, రక్షణ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా దేశీయ జెట్ ఇంజన్ల ఉత్పత్తిపై నిర్ణయం జరిగింది. ప్రధాని మోదీ గౌరవార్థం అధ్యక్షుడు జోబైడన్ వైట్ హౌస్ లో ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. పసందైన వంటకాలతో ప్రత్యేక అతిథి మర్యాదలు చేశారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ రెండోసారి ప్రసంగించారు. ఉగ్రవాదం విషయంలో ప్రపంచ దేశాలు ఉపేక్షించకూడదన్నారు. పరోక్షంగా చైనాపై వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సూత్రాలు, నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. వివాదాలు శాంతియుతంగా పరిష్కరించడం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవడం అన్ని దేశాల బాధ్యతగా గుర్తుచేశారు. అప్పుడే గ్లోబర్ ఆర్డర్ అనేది అమలవుతుందన్న విషయం గుర్తెరగాలని పరోక్షంగా చైనా గురించి ప్రస్తావించారు.

భారత్ ప్రపంచహిత దేశమని గుర్తుచేశారు. భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచమే అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మొదటిసారిగా అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఐదో స్థానంలో ఉందన్నారు. త్వరలో మూడోస్థానానికి ఎగబాకనుందని చెప్పారు. ప్రపంచ అభివృద్ధికి అమెరికా,భారత్ కలిసి నడవాల్సి ఉందన్నారు. అమెరికాలో విద్యావనరులు ఉంటే.. భారత్ లో అపారమైన యువశక్తి ఉందన్నారు. ఈ రెండూ కలిస్తేనే సుస్థిర సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనికి అమెరికా దిగ్గజాలు సైతం తమ కరతాళ ధ్వనులతో బలపరిచారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అభినందించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version