Homeఅంతర్జాతీయంIceland Earthquakes: 14 గంటలు.. 800 భూకంపాలు.. అల్లకల్లోలంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ

Iceland Earthquakes: 14 గంటలు.. 800 భూకంపాలు.. అల్లకల్లోలంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ

Iceland Earthquakes: యూరప్‌లోని ఐస్‌లాండ్‌ దేశం.. సైజులో మన తెలంగాణ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. జనాభా 4 లక్షలకన్నా తక్కువే. కానీ ఆ దేశం అగ్ని పర్వతాల పుట్ట. అంతచిన్న దేశంలోనే 30 అగ్ని పర్వతాలు ఉన్నాయి. పేరుకు, చూపుకి మాత్రం ఐస్లాండ్‌. ఆ దేశం కింద తక్కువ లోతులోనే వేల డిగ్రీల వేడితో సలసల కాగే మాగ్మా ఉంది. ఆ మాగ్మా కదిలినప్పుడల్లా భూమి కంపిస్తుంది. కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని రీతిలో రెండున్నరేళ్ల క్రితం (2021 మార్చిలో) వారం వ్యవధిలోనే 18 వేల సార్లు భూమి కంపించింది. అయితే వాటిలో ఏ ఒక్కసారి కూడా రిక్టర్‌ స్కేలుపై 5.6 తీవ్రత దాటలేదు. ప్రకంపనల తీవ్రత పెరిగితే ఎక్కడ అగ్ని పర్వతాలు బద్దలవుతాయోనని ఆ దేశం ఆందోళన చెందింది.

తాజాగా ప్రకంపనలు..
ప్రాథమిక గణాంకాల ప్రకారం, గ్రిందావిక్‌కు ఉత్తరాన 5.2 తీవ్రతతో అతిపెద్ద ప్రకంపనలు నమోదయ్యాయి. దేశంలోని నైరుతి రేక్‌జానెస్‌ ద్వీపకల్పంలో వరుస శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రమత్తమైన ఐస్‌లాండ్‌ ప్రభుత్వం శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ ప్రకంపనలు అగ్నిపర్వతాల విస్పోటనానికి కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. గ్రిందావిక్‌కు ఉత్తరాన ఉన్న సుంధంజూకాగిగర్‌ వద్ద తీవ్రమైన భూకంపం(కార్యకలాపం) కారణంగా పౌర రక్షణ కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించామని సివిల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

సుమారు 4 వేల జనాభా..
గ్రిందావిక్‌ గ్రామంలో సుమారు 4 వేల మంది జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం భూకంప సమూహం నమోదైన ప్రాంతానికి నైరుతి దిశలో మూడు కిలోమీటర్లు(1.86 మైళ్ళు) దూరంలో ఈ గ్రామం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు జనాభా తరలింపునకు చర్యలు చేపట్టారు. అగ్నిపర్వతం బద్ధలైతే భూకంపాలు సంభవించిన వాటి కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

బలమైన భూకంప కేంద్రాలు..
రాజధాని రేక్‌జావిక్‌కు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో రెండు బలమైన భూకంప కేంద్రాలను అధికారులు గుర్తించారు. భూ ప్రకంపనలకు దేశంలోని దక్షిణ తీరంలో చాలా వరకు, కిటికీలు మరియు గృహోపకరణాలు ధ్వనించాయి ప్రాథమిక గణాంకాల ప్రకారం, గ్రిందావిక్‌కు ఉత్తరాన 5.2 తీవ్రతతో అతిపెద్ద ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రకంపనల కారణంగా గ్రిందావిక్‌కు ఉత్తరం–దక్షిణం వైపు వెళ్లే రహదారిని పోలీసులు శుక్రవారం మూసివేశారు. ఐఎంవో ప్రకారం.. అక్టోబర్‌ చివరి నుంచి ద్వీపకల్పంలో దాదాపు 24 వేల ప్రకంపనలు నమోదయ్యాయి, శుక్రవారం అర్ధరాత్రి మరియు 1400 జీఎంటీ మధ్య దాదాపు 800 భూకంపాలు నమోదయ్యాయి. ఉపరితలం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల (3.1 మైళ్లు) లోతులో శిలాద్రవం భూగర్భంలో పేరుకుపోయిందని ఐఎంవో గుర్తించింది. అది ఉపరితలం వైపు కదలడం ప్రారంభిస్తే అది అగ్నిపర్వత విస్ఫోటనానికి దారితీయవచ్చని అంచనా వేశారు. అయితే శిలాద్రవం ఉపరితలం చేరుకోవడానికి చాలా రోజులు పడుతుందని తెలిపింది.

పడమరవైపు శిలాద్రవం..
భూకంప కార్యకలాపాలు అత్యధికంగా ఉన్న చోట ఒక చీలిక కనిపించగా లావా గిందావిక్‌ వైపు కాకుండా ఆగ్నేయ, పడమర వైపు ప్రవహిస్తుందని గుర్తించారు. అయినప్పటికీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొటెక్షన్‌ పెట్రోలింగ్‌ నౌక థోర్‌ను భద్రత దృష్టా గ్రిండావిక్‌కు పంపుతున్నట్లు తెలిపింది. శుక్రవారం తర్వాత గ్రిండావిక్‌లో ఎమర్జెన్సీ షెల్టర్‌లు, సహాయ కేంద్రాలు, అలాగే దక్షిణ ఐస్‌లాండ్‌లోని మరో మూడు ప్రదేశాలలో సమాచార ప్రయోజనాల కోసం తరలింపులో ప్రజలకు సహాయం చేయడం కోసం తెరుస్తారు. గురువారం, బ్లూ లగూన్, భూఉష్ణ స్పాలు, లగ్జరీ హోటళ్లకు ప్రసిద్ధి చెందిన గ్రిండావిక్‌ సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం, మరొక భూకంపం సమూహం తర్వాత ముందుజాగ్రత్తగా మూసివేయబడింది. రేక్‌జానెస్‌ ద్వీపకల్పంలోని 30 వేల మంది నివాసితులకు విద్యుత్‌ మరియు నీటి యొక్క ప్రధాన సరఫరాదారు అయిన స్వర్ట్‌సెంగి జియోథర్మల్‌ ప్లాంట్‌ కూడా సమీపంలో ఉంది. విస్ఫోటనం సంభవించినప్పుడు ప్లాంట్‌ను అందులోని కార్మికులను రక్షించడానికి ఇది ఆకస్మిక ప్రణాళికలను కలిగి ఉంది.

గతంలో పేలుళ్లు..
– 2021 మార్చి నుంచి ఆగస్టు వరకు రేక్జాన్స్‌ ద్వీపకల్పంలో 2022 జూలై, 2023లో మూడు విస్ఫోటనాలు సంభవించాయి. ఆ మూడు ఏ మౌలిక సదుపాయాలు లేదా జనావాస ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి.

– మార్చి 2021 విస్పోటనానికి ముందు ఫాగ్రాడల్స్‌ఫ్జల్‌ పర్వతం చుట్టూ జనావాసాలు లేని ప్రాంతంలో, రెక్జా¯Œ ్స అగ్నిపర్వత వ్యవస్థ ఎనిమిది శతాబ్దాలపాటు నిద్రాణంగా ఉంది.

– 2010 ఏప్రిల్‌లో అగ్నిపర్వతం వద్ద భారీ విస్ఫోటనం, ద్వీపం యొక్క దక్షిణాన ఉన్న ఐజాఫ్జల్లాజోకుల్, 20 దేశాలకు దాదాపు లక్ష విమానాలు రద్దు చేయవలసి వచ్చింది. దీంతో 10 మిలియన్ల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.

33 అగ్ని పర్వతాలు..
ఐస్‌లాండ్‌లో 33 క్రియాశీల అగ్నిపర్వత వ్యవస్థలు ఉన్నాయి, ఐరోపాలో అత్యధిక సంఖ్య. ఉత్తర అట్లాంటిక్‌ ద్వీపం మిడ్‌–అట్లాంటిక్‌ రిడ్జ్‌ను దాటింది, సముద్రపు అడుగుభాగంలో యురేషియన్, ఉత్తర అమెరికా టెక్టోనిక్‌ ప్లేట్‌లను వేరు చేస్తుంది.

ముందు జాగ్రత్తగా అలర్ట్‌
800 సార్లు భూమి కంపించడంతో ఐస్లాండ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ దేశం మీదుగా విమానాలు వెళ్లే అన్ని దేశాలకు ఈ సమాచారం అందజేశారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టులకు పెనిన్సులా ఏరియాలో ఏ క్షణమైనా అగ్ని పర్వతం పేలే చాన్స్‌ ఉందని తెలియజేస్తూ అలర్ట్‌ జారీ చేశారు. అగ్ని పర్వతాలు ఉన్నట్టుండి బద్దలైతే లావా, బూడిద ఎగసిపడి ఎయిర్‌ ట్రావెల్క ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version