Hantavirus Outbreak: ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటారు. కానీ కొంతమంది పిచ్చి ప్రపంచాన్ని ఆనందంలో కాకుండా ఏడుపులో ముంచి వేస్తుంది. చైనా శాస్త్రవేత్తల నిర్లక్ష్యం ప్రపంచాన్ని కరోనాకు బలి చేసింది. చివరికి చైనా శాస్త్రవేత్తలు కూడా కోవిడ్ వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ శాస్త్రవేత్త చేసిన పని కూడా అలాంటిదే.
అతడి పేరు లియో. ఇతడు ఉండేది డచ్ ప్రాంతంలో. ఇతడు శాస్త్రవేత్త. పక్షులను పరీక్షించడం.. కొత్త కొత్త జీవజాతులను ప్రపంచానికి పరిచయం చేయడం ఇతడికి చాలా ఆసక్తికరమైన పని. అయితే ఇతను చేసిన ఒక పని ప్రపంచాన్ని వైరస్ మీద నిలబెట్టింది. అంతేకాదు ఇప్పుడు ఆ వైరస్ గురించి ప్రపంచం మొత్తం ఈపరితంగా భయపడుతోంది.
లియో హంట వైరస్ బారిన పడి చనిపోయాడు. ఈ వైరస్ సోకిన మొదటి వ్యక్తి ఇతడే. అత్యంత అరుదైన పక్షి జాతులను చూసేందుకు ఇతడు తాపత్ర పడుతుంటాడు. అది ఇతడిని హంట వైరస్ బారిన పడేలా చేసింది. ఇతడు క్రూజ్ నౌక లో ప్రయాణించాడు.. లియో తోపాటు అతని సతీమణి కూడా చనిపోయింది.
అత్యంత అరుదైన పక్షులను చూసేందుకు లియో, అతని భార్య మీర్జామ్ దాదాపు ఐదు నెలల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించారు. ఈ క్రమంలో మార్చి 27న అర్జెంటీనాలో ఒక ప్రాంతం వద్దకు వెళ్లారు. అక్కడ డార్విన్ కరకర పక్షిని చూసేందుకు చాలాసేపు అక్కడే ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత లియో దంపతులు 100కు పైగా ప్రయాణికులతో కలిసి ఆ నౌకలో ప్రయాణం మొదలుపెట్టారు. గత నెల 6న లియో జ్వరం బారిన పడ్డాడు. ఆ తర్వాత తీవ్రమైన అస్వస్థతకు గురై ఐదు రోజుల అనంతరం చనిపోయాడు.
గత నెల 24న లియో భార్య.. తన భర్త మృతదేహంతో అట్లాంటిక్ లోని సెయింట్ హెలెనా ద్వీపంలో దిగింది. దక్షిణాఫ్రికా నుంచి డచ్ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ప్రయాణంలోనే ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. నీతో ఆమె కూడా చనిపోయింది. ఈ నెల 4న వారి మృతదేహాలకు పరీక్ష నిర్వహించగా వైరస్ దొరికినట్టు అధికారులు గుర్తించారు.
అర్జెంటీన ప్రాంతంలో చెత్తకుప్పలు ఉన్న ఏరియాలలో ఎలుకల రెట్టల నుంచి వచ్చే దుర్గందాన్ని పీల్చడం వల్ల వీడియో వైరస్ బారిన పడ్డట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ వైరస్ అతనికి ప్రాణాంతకంగా మారిందని పేర్కొంటున్నారు.. ఆ నౌకలో ప్రయాణించిన మరో 8 మందికి కూడా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. ఇందులో ముగ్గురు ఇప్పటికే చనిపోయారు. ఆ నౌకలో 23 దేశాలకు సంబంధించిన 140 మంది ప్రయాణించారు. ఇప్పటికే అనౌక నెదర్లాండ్ ప్రాంతానికి చేరింది. వైరస్ సోకని వారి వారి ప్రాంతాలకు పంపించారు.