China : డిగ్రీ చేసి శవాలుగా మారుతున్నారు.. చైనాలో మిస్టరీ మరణాలు?

చైనాలో గ్రాడ్యుయేట్లు తమ కష్టానికి, విద్యకు తక్కువ ప్రతిఫలం ఉన్నట్లు అనిపించడంతో నిరుత్సాహానికి గురవుతారు. కొంతమంది విద్యార్థులు ఈ సాంప్రదాయేతర గ్రాడ్యుయేషన్‌ ఫొటోలను గ్జియాంగస్‌ అనే చైనీస్‌ యాప్‌లో పోస్ట్‌ చేసి నిరసన తెలుపుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : July 2, 2023 10:44 am
Follow us on

China : చైనా దేశంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారందరూ శవాలుగా మారుతున్నారు. అయితే వాళ్లు నిజంగా చనిపోయి శవాలుగా మారడం లేదు.. శవాలుగా మారినట్లు నేలపై పడుకొని ఫోజులు ఇస్తున్నారు. గ్రాడ్యుయేషన్‌ గౌనులో ఇటీవల ఓ యువతి నేలపై పడుకుని చనిపోయినట్లు కనిపించిన ఫొటో ఒకటి చైనీస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇతర ఫొటోలలో ఆమె కుర్చీపై జారిపడి కూర్చున్నట్లు, గోడకు ఆనుకుని, మెట్ల మీద చనిపోయినట్లు కనిపించాయి. అయితే ఇదంతా అక్కడి పాలకులపై నిరసన. జాబ్‌మార్కెట్‌ నెమ్మదించడంతో తమకు ఉద్యోగాలు రావడం లేదని ఇలా వినూత్న నిరసన తెలుపుతున్నారు. తమకు చావే శరణ్యం అన్నట్లు ఫొటోలు చైనా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

గ్రాడ్యుయేట్ల పరిస్థితికి అద్దం పట్టేలా.. 

ఈ ఫొటోలు చైనాలో ఇటీవలి గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవికతను ప్రతిబింబించేలా ఉన్నాయి. చాలా మంది సాధారణ గ్రాడ్యుయేషన్‌ పోర్ర్‌టెయిట్లకు బదులుగా ఈ అసాధారణ చిత్రాలను షేర్‌ చేస్తున్నారు. ఫొటోలతో పాటుగా ఉన్న ఈ టైటిల్స్‌ వారు చనిపోయిన్నట్లుగా అందర్నీ భ్రమింప చేస్తున్నాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1.16 కోట్ల మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగ వేట ప్రారంభించబోతున్నారు. కానీ ఉద్యోగావకాశాలు అన్ని కనిపించడం లేదు. నగరాల్లో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో ఉంది, మేలో 20.8%కి చేరుకుంది. జాబ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉద్యోగార్ధుల సంఖ్య పెరగడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది.

నిరుద్యోగ సంక్షోభం.. 
చైనాలో జాబ్‌ మార్కెట్‌ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇది ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం ప్రతికూల ధోరణిని తిప్పికొట్టలేకపోయింది. కఠినమైన విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఈ దేశంలో చాలా ఉద్యోగాలను అందించే ప్రైవేట్‌ రంగంపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో చాలా మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకునే సాంకేతికత, విద్య వంటి పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నిరుత్సాహంతో వినూత్న నిరసన.. 
చైనాలో గ్రాడ్యుయేట్లు తమ కష్టానికి, విద్యకు తక్కువ ప్రతిఫలం ఉన్నట్లు అనిపించడంతో నిరుత్సాహానికి గురవుతారు. కొంతమంది విద్యార్థులు ఈ సాంప్రదాయేతర గ్రాడ్యుయేషన్‌ ఫొటోలను గ్జియాంగస్‌ అనే చైనీస్‌ యాప్‌లో పోస్ట్‌ చేసి నిరసన తెలుపుతున్నారు. కామెంట్స్‌లో తమ నిరాశ, నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. చైనా విద్యార్థులు తదుపరి విద్యను అభ్యసించడం కూడా విలువైనదేనా అని ప్రశ్నిస్తున్నారు.