Madhya Pradesh : ఒక వ్యక్తి చనిపోతే అక్కడి ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరుపుతారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆత్మకు శాంతి కలగాలని వివిధ రకాల క్రతువులు నిర్వహిస్తుంటారు. కాని మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఓ తండ్రి తన కూతురికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇప్పుడు ఈ సంఘటన కాస్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ స్మశాన వాటికలో కూతురు బతికి ఉండగానే తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ సంఘటన వెనుక ఒక బలమైన కారణం ఉంది. విధిష ప్రాంతంలో ఓ తండ్రి పిండితో తన కూతురు బొమ్మను తయారు చేశాడు. దానికి కర్మలు నిర్వహించాడు. వాస్తవానికి అతని కూతురు బతికే ఉంది. పిండితో అతడు కుమార్తె బొమ్మను తయారుచేసి అంత్యక్రియలు నిర్వహించడం గ్రామస్తులను భావోద్వేగానికి గురి చేసేది.
విదిష ప్రాంతానికి చెందిన సవిత కుస్వాహ కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కుమార్తె అలా వెళ్ళిపోవడంతో ఆ తండ్రి చాలా ఇబ్బంది పడ్డాడు. సవిత కోసం కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాలలో గాలించారు. అయితే ఆమె ఒక యువకుడితో వెళ్లిపోయినట్లు వారి పరిశీలనలో తేరింది. దీంతో సవిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సవిత చేసిన పని వల్ల గ్రామంలో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సవిత చనిపోయిందని భావించిన ఆమె తండ్రి.. తమ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరపాలని భావించారు. పిండితో సవిత దిష్టిబొమ్మ తయారు చేశారు. ఆ తర్వాత దానిని పాడే మీద మోసి గ్రామంలో ఊరేగించారు. స్మశాన వాటికలో ఆ బొమ్మకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు మొత్తం వచ్చారు. ” కూతుర్ని అత్యంత ప్రేమగా పెంచాను. ఉన్నత చదువులు చెప్పించాను. కాని చివరికి ఆమె ఇలా చేసింది. ఏం చేయాలో తెలియదు. ఎవరిని నిందించాలో తెలియదు. నా జీవితంలో అత్యంత కఠినమైన క్షణం ఇది. అందువల్లే పిండితో ఆమె దిష్టిబొమ్మ తయారుచేసి అంత్యక్రియలు నిర్వహించామని” సవిత తండ్రి పేర్కొన్నారు.
In Vidisha, Madhya Pradesh, a deeply emotional incident unfolded after a 23-year-old woman eloped and married her boyfriend.
Heartbroken and feeling socially humiliated, her family performed symbolic last rites using a dough effigy, complete with a procession and cremation… pic.twitter.com/XpwWgzypJH
— World Update (@DataoftheWorld) December 22, 2025