Homeఅంతర్జాతీయంVenezuela: వెనెజువెలాపై సైబర్‌ యుద్ధం.. బుల్లెట్‌ లేకుండా గెలిచిన అమెరికా వ్యూహం

Venezuela: వెనెజువెలాపై సైబర్‌ యుద్ధం.. బుల్లెట్‌ లేకుండా గెలిచిన అమెరికా వ్యూహం

Venezuela: ట్రిగర్‌ జారలేదు, గుండు బయల్దేరలేదు, మిసైల్‌ ప్రయోగం జరగలేదు. అయినా వెనెజువెలాలో పూర్తి యుద్ధం జరిగి ముగిసింది. అమెరికా విమానాలు ఎగరకుండా, రాడార్లు మౌనంగా మారాయి. అధ్యక్షుడు మదురో దంపతులు అదుపులోకి రాలేదు. ఇది సైబర్‌ యుద్ధం – నాలుగు సంప్రదాయ యుద్ధాలకు (నేల, ఆకాశ, సముద్ర, స్పేస్‌) ఐదవ అధ్యాయం. ప్రపంచ యుద్ధ చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన ఈ ఘటన ప్రతి దేశానికి పాఠాలు చెబుతోంది. సైబర్‌ దాడి వ్యూహం.. వెనెజువెలా విద్యుత్‌ […]

Venezuela: ట్రిగర్‌ జారలేదు, గుండు బయల్దేరలేదు, మిసైల్‌ ప్రయోగం జరగలేదు. అయినా వెనెజువెలాలో పూర్తి యుద్ధం జరిగి ముగిసింది. అమెరికా విమానాలు ఎగరకుండా, రాడార్లు మౌనంగా మారాయి. అధ్యక్షుడు మదురో దంపతులు అదుపులోకి రాలేదు. ఇది సైబర్‌ యుద్ధం – నాలుగు సంప్రదాయ యుద్ధాలకు (నేల, ఆకాశ, సముద్ర, స్పేస్‌) ఐదవ అధ్యాయం. ప్రపంచ యుద్ధ చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన ఈ ఘటన ప్రతి దేశానికి పాఠాలు చెబుతోంది.

సైబర్‌ దాడి వ్యూహం..
వెనెజువెలా విద్యుత్‌ గుర్రం గురీ డ్యామ్‌ సూపర్‌ విజరీ సిస్టమ్‌ మొదట లక్ష్యం. రెండు కీలక టార్గెట్లతో మొత్తం విద్యుత్‌ సరఫరా కట్‌ అయింది. మిలటరీ అంధకారంలో మునిగింది. రాడార్లు ఆఫ్, ఎయిర్‌ఫోర్స్‌ ఇన్వర్టర్లపై ఆధారపడింది. ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ కూడా నిలిచిపోయింది. టెలిఫోన్లు పనిచేయలేదు, సమాచార బదిలీ ఆగిపోయింది. రాడార్లు రీబూట్‌ అయ్యే ముందే 150 అమెరికా విమానాలు దేశంలోకి చేరాయి.

పదేళ్ల మాస్టర్‌ ప్లాన్‌..
ఇది ఒక్కరోజు ఆపరేషన్‌ కాదు. 10–15 ఏళ్లుగా అమెరికా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ చిప్స్‌లో మాల్‌వేర్‌ ఏర్పాటు చేసింది. ఎప్పుడు కావాలంటే ఆ సిస్టమ్‌ షట్‌డౌన్‌ చేసే సామర్థ్యం కలిగింది. వెనెజువెలా చిప్స్‌ ఆధారంగా ఉండటం వల్ల వారి ప్రత్యేక రక్షణ లేకపోయింది. దొంగల మార్గాలు, సైనిక కదలికలు అన్నీ అమెరికాకు తెలిసాయి.

భారత్‌కు పాఠాలు..
– యుద్ధ సమయంలో విద్యుత్‌ అంతరాయం తప్పనిసరి. సోలార్, జనరేటర్లు సిద్ధంగా ఉండాలి. విదేశీ చిప్స్, సాఫ్ట్‌వేర్‌లో బ్యాక్‌డోర్‌ ఉండే అవకాశం. స్వదేశీ సాంకేతికతపై ఆధారపడాలి. సైబర్‌ దాడులకు తట్టుకునే ఆల్టర్నేటివ్‌ నెట్‌వర్క్‌లు అవసరం.

భవిష్యత్‌ యుద్ధాలు..
అజర్‌బైజాన్‌ డ్రోన్‌ యుద్ధంలా, ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌లా సైబర్‌ యుద్ధం కూడా కొత్త నార్మల్‌. ఇజ్రాయెల్‌ లెబనాన్‌ పేజర్‌ బాంబుల్లా భవిష్యత్‌ యుద్ధాలు హైబ్రిడ్‌ రూపంలో ఉంటాయి. పౌరులు, మిలటరీ, సైబర్‌ బలగాల మధ్య సమన్వయం లేకుండా గెలుపు అసాధ్యం.

వెనెజువెలా యుద్ధం ప్రపంచ రక్షణ వ్యూహాలను మార్చేస్తుంది. భారత్‌కు స్వదేశీ సాంకేతికత, సైబర్‌ రక్షణ, పౌర–సైనిక సమన్వయంపై దృష్టి పెట్టాలి. రాబోయే యుద్ధాలు బుల్లెట్‌లు కాకుండా బైట్‌లతో జరుగుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper