Homeఅంతర్జాతీయంBaloch National Movement: బలూచ్ ప్రజల గొంతుక ఇతడు.. 17 ఏళ్లుగా పాకిస్తాన్ తొక్కి పెడుతూనే...

Baloch National Movement: బలూచ్ ప్రజల గొంతుక ఇతడు.. 17 ఏళ్లుగా పాకిస్తాన్ తొక్కి పెడుతూనే ఉంది..

Baloch National Movement: అతడు అన్యాయాన్ని తట్టుకోలేడు. అక్రమాన్ని సహించలేడు. దుర్మార్గాన్ని ఎదిరిస్తాడు. అందువల్లే అతడు ఆ ప్రాంతానికి నాయకుడు అయ్యాడు. దీన ప్రజల గొంతుక అయ్యాడు. అటువంటి వ్యక్తులను రాజ్యం ఎప్పటికీ కూడా ఒప్పుకోదు. అంతేకాదు తొక్కేస్తూ ఉంటుంది. అటువంటి పనిని పాకిస్తాన్ ప్రభుత్వం చేసింది. కానీ అతని గురించి వేలాదిశక్తులు. పోరాడుతున్నాయి. అందులో అతని కుమార్తె కూడా ఉంది.

అతని పేరు మహమ్మద్ బలూచ్.. ఇతడు వైద్యుడు.. బలూచ్ నేషనల్ మూమెంట్ (బి.ఎన్.ఎం) సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. బలోచ్ ప్రాంతానికి స్వేచ్ఛ కోసం ఇతడు చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాడు. అయితే ఇతడిని పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు 17 సంవత్సరాలుగా అతడిని తమ ఆధీనంలోనే ఉంచుకుంది. అయితే ఇప్పటికే అతడు జీవించి ఉన్నాడా.. లేక పాకిస్తాన్ ప్రభుత్వం చంపేసిందా.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

మహమ్మద్ కోసం అతడి కుమార్తె నసీం తీవ్రంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గడిచిన 17 సంవత్సరాలుగా ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. ఒక నాయకుడి పరిస్థితి ఇలా ఉంటే.. అక్కడ సాధారణ ప్రజల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్యమాలను.. స్వేచ్ఛ కోసం గొంతెత్తుతున్న వ్యక్తులను ఏ విధంగా తొక్కేస్తుందో ఇది ఉదాహరణ మాత్రమే. కేవలం మహమ్మద్ మాత్రమే కాదు.. చాలామంది వ్యక్తులను పాకిస్తాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. కఠినమైన కారాగారాలలో ఉంచుతోంది. ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినప్పటికీ వారిని బయట ప్రపంచానికి చూపించడం లేదు.. దీనిని బట్టి పాకిస్తాన్ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. పాకిస్తాన్ దేశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన వారికి.. హక్కుల కోసం పోరాడే వారికి.. న్యాయం కోసం నినదించే వారికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని విదేశీ జర్నలిస్టులు కూడా అంటున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో ఒత్తిడి పెడుతున్నప్పటికీ.. చివరికి బలుచ్ ప్రజల పోరాటమే గెలుస్తుందని బి ఎన్ ఎం నాయకులు అంటున్నారు.

మహమ్మద్ కోసం ఆయన కుమార్తె నసీం తీవ్రంగా పోరాటాలు చేస్తున్నారు. ఈమె పాకిస్తాన్లో మానవ హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. 2009లో తన తండ్రి అదృశ్యమైన నాటి నుంచి ఆమె పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈమె బలూచ్ లో యాక్షన్ కమిటీ నాయకురాలుగా పనిచేస్తున్నారు. 2014లో క్వెట్టా ప్రాంతం నుంచి ఇస్లామాబాద్ వరకు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈమెను అనేకసార్లు పాకిస్తాన్ బలగాలు అడ్డుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే అవకాశాన్ని కూడా లేకుండా చేశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పట్టుకున్న వేలాది మంది కోసం ఈమె పోరాటాలు చేస్తూనే ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version