Viral Video: రైలు పట్టాలపై రెండు ఎద్దుల భీకరమైన ఫైటింగ్..అంతలో అటునుంచి వస్తున్న రైలు..ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశం..!

Viral Video: అంతలో దూరం నుంచి ఒక రైలు పట్టాలపై దూసుకొని వస్తుంది.ప్రస్తుతం ఈ ఎద్దుల ఫైటింగ్ కి సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో...ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వీడియొ చూసినట్లయితే...రెండు ఎద్దులు ఒక రైలు గేటు సమీపంలో భీకర ఫైట్ కు దిగాయి.తమ పదునైన కొమ్ములతో ఒకదానిని ఒకటి తోసుకున్నాయి.

Written By: NARESH, Updated On : July 7, 2024 9:55 pm

Viral Video

Follow us on

Viral Video: రైలు ట్రాక్ మీద అటుగా ఒక ఎక్స్ ప్రెస్ రైలు వస్తుండటం తో రైల్వే సిబ్బంది గేట్ వేశారు.సరిగ్గా అదే సమయంలో ఎక్కడ నుంచి వచ్చాయో గాని రెండు ఎద్దులు రైలు గేటు సమీపంలో వచ్చాయి.ఆ రెండు ఎద్దులు ఒకదానిని ఒకటి కొమ్ములతో తోసుకుంటూ భీకర ఫైట్ ను మొదలుపెట్టాయి.

అంతలో దూరం నుంచి ఒక రైలు పట్టాలపై దూసుకొని వస్తుంది.ప్రస్తుతం ఈ ఎద్దుల ఫైటింగ్ కి సంబంధించిన వీడియొ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఘటన ఎక్కడ జరిగిందో…ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ వీడియొ చూసినట్లయితే…రెండు ఎద్దులు ఒక రైలు గేటు సమీపంలో భీకర ఫైట్ కు దిగాయి.తమ పదునైన కొమ్ములతో ఒకదానిని ఒకటి తోసుకున్నాయి.

ఆ ఎద్దుల ఫైట్ చూసి అవి ఎక్కడ తమ మీదకు వస్తాయేమో అని అక్కడ ఉన్న జనాలు దూరంగా జరిగారు.ఇక ఆ ఎద్దులు కొమ్ములతో తోసుకుంటూ రైలు గేటు దాటి ట్రాక్ మీదకు వెళ్లాయి.అదే పట్టాల మీద దూరం నుంచి ఒక రైలు దూసుకొని వస్తుంది.ఈ ఎద్దుల పోరాటాన్ని అనూహ్యంగా దూరం నుంచి గమనించిన ట్రైన్ డ్రైవర్ రైలు వేగాన్ని మెల్లగా తగ్గించాడు.

సరిగ్గా ఎద్దుల దగ్గరకు వచ్చేసరికి ఆ ట్రైన్ డ్రైవర్ సడన్ బ్రేక్ ను వేసాడు.కొద్దిసేపు కొట్టుకున్న తర్వాత ఆ ఎద్దులు అక్కడ నుంచి వెళ్లిపోతాయి అని అందరు భావించారు.కానీ ఎంత సేపైనా అవి వెళ్లకపోవడంతో వాటిని తరిమి కొట్టడానికి వాటి పై నీళ్లను పోశారు స్థానికులు.చివరికి ఆ ఎద్దులు అక్కడ నుంచి వెళ్లిపోవటంతో ఆ ఘటన సర్దుమణిగింది.ఎద్దుల ఫైటింగ్ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.