Homeట్రెండింగ్ న్యూస్America: చనిపోయిన నాన్న గుండె కొట్టుకుంటోంది.. ఆ చప్పుడు విన్న కూతుళ్లు!

America: చనిపోయిన నాన్న గుండె కొట్టుకుంటోంది.. ఆ చప్పుడు విన్న కూతుళ్లు!

America: మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి.

నాలుగేళ్ల క్రితం మరణం..
అమెరికాలోని కనెక్టికట్‌ ప్రాంతానికి చెందిన ఎస్టబెన్‌ శాంటియాగో(39) నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంలో ఎస్టబెన్‌ శాంటియాగో అవయవాలు దానం చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత తన తండ్రి గుండె ఎవరికి అమర్చారో తెలుసుకునే ప్రయత్నం చేశారు కూతుళ్లు.. చివరకు గుండె స్వీకరించిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు.

నాలుగేళ్లుగా వెతుకులాట..

ఎస్టబెన్‌ శాంటియాగో కూతురు కిసండ్ర శాంటియాగో(22) తండ్రి గుండె అమర్చిన వ్యక్తి కోసం ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగింది. చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు.

నా గుండె తేలికైంది..
ఈ సందర్భంగా కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. ‘మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది’ అని తెలిపింది. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా విశేషమైన స్పందన వస్తోంది.

కొడుకు అవయవాలు దానం చేసి..
ఇటీవల ఓ వైద్యురాలి కొడుకు చేతికి వచ్చాక అర్ధంతరంగా చనిపోయాడు. స్వయంగా వైద్య వృత్తిలో ఉన్న ఆమె కొడుకు పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని.. తనయుడి అవయవాలతో మరో నలుగురికి జీవం పోసింది. చనిపోయిన గంట వ్యవధిలోనే తనయుడి గుండెను మరో వ్యక్తికి అమర్చారు. గుండెను స్వీకరించిన వ్యక్తి కృతజ్ఞత చెప్పడానికి తనదగ్గరకు రావడంతో స్టెతస్కోప్‌తో తన కొడుకు గుండెచప్పుడు విని మురిసిపోయింది. ఈ ఘటన ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

దానంతో అవయవాలు పదిలం..
అవయవదానం చేయడం ద్వారా ఇష్టమైన వారి అవయవాలు ఇతరుల దేహాల్లో పదిలంగా ఉంటున్నాయి. దాతల సహకారంతో ఎంతోమందికి పునర్జన్మ లభిస్తోంది. అయితే గతంలో స్వీకర్తల వివరాలు చెప్పడానికి వైద్యులు అంగీకరించేవారు కాదు. కానీ ప్రియమైన వారి అవయవాలను చూసుకుని జ్ఞాపకాలు తలుచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో అవయవాలు అమర్చివారి వివరాలు వెల్లడిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version