Kaun Banega Crorepati: కోన్ బనేగా కరోడ్ పతి షోలో సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్న.. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో తెలుసా?

దేశం మొత్తం అభిమానులు ఉన్న ఈ షోలో సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశ్న అడిగారు అమితాబ్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని అడిగారు.

Written By: NARESH, Updated On : December 29, 2023 12:58 pm

Kaun Banega Crorepati

Follow us on

Kaun Banega Crorepati: ఇండియాస్ మోస్ట్ పాప్యులర్ షో కోన్ బనేగా కరోడ్ పతి. ప్రస్తుతం సీజన్ 15 కొనసాగుతుంది. కొన్ని కారణాలతో అమితాబ్ ఫ్యామిలీ ఆర్థికంగా జీరో అయిపోయింది. ఒకప్రక్క సినిమా ఆఫర్స్ లేవు. ఆ టైం లో కోన్ బనేగా కరోడ్ పతి షో హోస్ట్ గా మారిన అమితాబ్ ఆర్థికంగా తిరిగి పుంజుకున్నారు. బుల్లితెర ఆయన్ని మరలా జనాల్లోకి తీసుకెళ్లింది. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. కోన్ బనేగా కరోడ్ పతి అంటే ముందుగా అమితాబ్ గుర్తొస్తారు.

ఇక ఈ షో వేదికగా అనేక సంచలనాలు నమోదు అయ్యాయి. చాలా మంది కంటెస్టెంట్స్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. వీరిలో కొందరు పెద్దగా చదువుకోని, అంతగా పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో ఎన్నడూ కోటి రూపాయల ప్రైజ్ మనీ ఆఫర్ చేసిన రియాలిటీ షో ఇండియాలో లేదు. ఇంతటి పాపులారిటీ కావడానికి హోస్ట్ అమితాబ్ తో పాటు ఇది కూడా కారణం.

దేశం మొత్తం అభిమానులు ఉన్న ఈ షోలో సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశ్న అడిగారు అమితాబ్. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని అడిగారు. ఆప్షన్స్ గా… ఏ. ఛత్తీస్ఘడ్ బి. తెలంగాణ సి. మధ్యప్రదేశ్ డి. ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు హాట్ సీట్ లో ఉన్న యువతి సమాధానం చెప్పలేకపోయింది. ఆమె హెల్ప్ లైన్ తీసుకుంది. మెజారిటీ ఆడియన్స్ తెలంగాణ అని రైట్ ఆన్సర్ చెప్పారు.

కోన్ బనేగా కరోడ్ పతి షోలో సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రశ్న అడగటం ఆయన క్రేజ్ తెలియజేస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీ ఆర్ ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశాడు. కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.