Vishnu Manchu: మనోజ్ తో గొడవ… నోరు విప్పిన మంచు విష్ణు! అక్కడ ఏం జరిగిందంటే?

Vishnu Manchu: మంచు బ్రదర్స్ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. విష్ణు ఆవేశంతో ఊగిపోతున్న వీడియో మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే నా వాళ్ళ మీద ఇలానే దాడికి దిగుతున్నాడు. ఇది సిట్యుయేషన్ అంటూ… ఆ వీడియోలో మాట్లాడారు. కొన్ని నెలలుగా మనోజ్-విష్ణు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ వీడియో సంచలనమైంది. నేడు ఉదయం నుండి మంచు కుటుంబం వ్యవహారం మీడియాలో రచ్చ అవుతుంది. వరుస […]

Written By: Shiva, Updated On : March 24, 2023 3:42 pm
Follow us on

Vishnu Manchu

Vishnu Manchu: మంచు బ్రదర్స్ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. విష్ణు ఆవేశంతో ఊగిపోతున్న వీడియో మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే నా వాళ్ళ మీద ఇలానే దాడికి దిగుతున్నాడు. ఇది సిట్యుయేషన్ అంటూ… ఆ వీడియోలో మాట్లాడారు. కొన్ని నెలలుగా మనోజ్-విష్ణు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఈ వీడియో సంచలనమైంది. నేడు ఉదయం నుండి మంచు కుటుంబం వ్యవహారం మీడియాలో రచ్చ అవుతుంది. వరుస కథనాలు హోరెత్తిస్తున్నాయి.

మనోజ్ పోస్ట్ చేసిన వీడియోపై మంచు విష్ణును వివరణ అడిగేందుకు మీడియా ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. విష్ణు మాట్లాడుతూ… ఇది చిన్న వ్యవహారం. నిన్న ఉదయం చోటు చేసుకున్న సంఘటన. మనోజ్ వయసులో చిన్నవాడు. ఆవేశంలో అది పోస్ట్ చేశాడు. దాన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సారథిని మనోజ్ అదుపు చేయలేదు.. అని చెప్పారు.

Vishnu Manchu

విష్ణు మాటలు గమనిస్తుంటే… ఈ వివాదంలో సారథి కీలకంగా ఉన్నారనిపిస్తుంది. సారథి మోహన్ బాబు వద్ద చాలా కాలంగా ఉంటున్నాడు. పేరుకు పనివాడు అయినప్పటికీ ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలుగుతాడు. మంచు ఫ్యామిలీ వ్యవహారాల్లో అన్నీ తానై వ్యహరిస్తారు. ఇక్కడ సారథిని మనోజ్ వెనకేసుకు వస్తున్నాడు. విష్ణు మాత్రం అతని మీద విరుచుకుపడుతున్నాడు. అన్నదమ్ముల గొడవల్లో సారథి పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది.

ఈ సంఘటనలో మంచు లక్ష్మి కూడా ఉన్నారని సమాచారం. మొదట ఆఫీస్ లో వివాదం రాజుకుంది. అక్కడ నుండి సారథి ఇంటికి మనోజ్, లక్ష్మి వచ్చారు. కాసేపటికి విష్ణు అక్కడకు చేరుకున్నారు. సారథి ఇంట్లో విష్ణు గొడవ చేశారు. అతన్ని సన్నిహితులు, సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన గొడవను నేడు మనోజ్ ఎందుకు పోస్ట్ చేశారు. అలాగే మనోజ్ అన్నయ్య విష్ణు మీద కంప్లైంట్ కూడా చేయబోయాడనేది సమాచారం. కొన్నాళ్లుగా మనోజ్-విష్ణు మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అవి నిజమే అని నేటి సంఘటనతో రుజువైంది. ఈ వ్యవహారం మీద మోహన్ బాబు సీరియస్ గా ఉన్నారట. ఇద్దరితో కీలక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.