spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : సభలకు జనహోరు.. పవన్ కళ్యాణ్ అదే ప్రభజనం సృష్టించబోతున్నాడా?

Pawan Kalyan : సభలకు జనహోరు.. పవన్ కళ్యాణ్ అదే ప్రభజనం సృష్టించబోతున్నాడా?

Pawan Kalyan : ఇప్పుడంటే బీరు,బిర్యానీ ఇస్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు నిర్వహించే భారీ బహిరంగ సభలకు జనం హాజరవుతున్నారు. కానీ ఇవేవీ లేని రోజుల్లో పలు సభలకు జనాలు తండోప తండాలుగా తరలి వెళ్లారు.. ఏకంగా ట్రెండ్ సెట్టింగ్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటి సభలో ఏవో ఒక్కసారి తెలుసుకుందామా? ఏ మాటకు ఆ మాట ఇలాంటి సభల్లో రికార్డులు క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్. తాజాగా శ్రీకాకుళం రణస్థలం సభకు లక్షల్లో పోటెత్తారు. పవన్ ప్రతీసభకు వెల్లువలా జనం వస్తున్నారు.

Panav Kalyan
Panav Kalyan

20 లక్షల మంది వచ్చారు

అది 1988 సంవత్సరం.. జూలై 10.. విజయవాడ.. ఆ ఎమ్మెల్యే పేరు వంగవీటి మోహన రంగా… కాపునాడు అనే పేరుతో సభ నిర్వహిస్తే జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఏకంగా 20 లక్షల మంది హాజరయ్యారు.. ఆ రోజుల్లో విజయవాడ నగరం ప్రజలతో కిటకిటలాడింది.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.. బందోబస్తుకు వచ్చిన పోలీసులు చేతులు ఎత్తేయడంతో ఆ సభకు వచ్చిన ప్రజలే ఆ పని పూర్తి చేశారు. ఈ సభ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోయయి. వంగవీటి మోహనరంగా కాపు సామాజిక వర్గంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించారు.

ప్రజారాజ్యం ఆవిర్భావ సభకు..

2008 ఆగస్టు 26న తిరుపతి కేంద్రంగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభకు 15 లక్షల మంది హాజరయ్యారు. స్వచ్ఛందంగా జనాలు రావడంతో తిరుపతి కిక్కిరిసిపోయింది. రైళ్ళన్నీ కిటకిటలాడాయి. ఈ సభ ద్వారానే ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది.

Panav Kalyan
Panav Kalyan

జనసేన కవాతు

ఆరోజు రాజమండ్రి జనసంద్రమై ఉప్పొంగింది.. జనసేనాని పిలుపుమేరకు ఒక్కో కార్యకర్త ఒక్కోసేనానిలాగా రాజమండ్రి తరలివచ్చారు. కవాతు అని దానికి పేరు పెడితే అచ్చం అలానే కావాతు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా కవాతు చేశారు.. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు వచ్చిన జనసేన కార్యకర్తలు తమ సత్తాను చాటారు.. ఈ కవాతు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమూలంగా మారాయి అనడంలో అతిశయోక్తి లేదు.

అమెరికాలో 30 లక్షల మంది వచ్చారు

ఇప్పుడంటే కే ఏ పాల్ కామెడీ పీస్ అయ్యాడు గానీ ఒకప్పుడు అతడు సభలు నిర్వహిస్తే జనం వేలాదిగా వచ్చేవారు. అతడిని కలిసేందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేచి ఉండేవారు. అలాంటి కేఏ పాల్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అమెరికాలో పీస్ ర్యాలీ నిర్వహిస్తే 30 లక్షల మంది దాకా వచ్చారు. 2001 నవంబర్ 3న ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత పాల్ ఎక్కడికో వెళ్లిపోయాడు.. తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన అల్లుడి కోసం పాల్ ను తొక్కేయడం మొదలుపెట్టాడు. ఫలితంగా పాల్ కామెడీ పీస్ అయ్యాడు.

చరిత్రలో నిలిచిపోయిన ఈ నాలుగు సభలకు 77 లక్షల మంది దాకా ప్రజలు వచ్చారు. ఇప్పట్లో ఈ సభలను బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదు అంటే అతిశయోక్తి కాక మానదు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper