Pawan Kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు.. సింగపూర్‌లో ఘటన.. ఏం జరిగిందంటే..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌(Pavan Kalyan) చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌(Singapur)లోని తన స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ఘటనలో మార్క్‌ శంకర్‌(Mark Shankar)కు చేతులు, కాళ్లకు గాయాలు కాగా, పొగ ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని సింగపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించి, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, మార్క్‌ శంకర్‌ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, కొంతకాలం విశ్రాంతి మరియు చికిత్స అవసరమని తెలిపారు.

Also Read: ఇది సార్ బ్రాండ్ అంటే.. రాజమౌళి, ఖాన్స్ ను మించిన అల్లు అర్జున్!

ఎలా జరిగిందంటే..
సింగపూర్‌లోని మార్క్‌ శంకర్‌ చదువుతున్న అంతర్జాతీయ స్కూల్‌(International School)లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, స్కూల్‌ భవనంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌(Electric Shart Sarqute) కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించినప్పటికీ, కొంతమంది విద్యార్థులు మరియు సిబ్బంది గాయాలపాలయ్యారు. స్కూల్‌ యాజమాన్యం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించింది. అలాగే, గాయపడిన విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.

విధులు విస్మరించని ఉప ముఖ్యమంత్రి..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం(Deputy CM) పవన్‌ కల్యాణ్‌ ఈ దుర్ఘటన గురించి సమాచారం అందింది. అయినప్పటికీ, ఆయన తన వ్యక్తిగత ఆందోళనను పక్కనపెట్టి, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పర్యటనను కొనసాగించాలని నిర్ణయించారు. ‘‘అరకు సమీపంలోని కురిడి గ్రామంలో గిరిజనులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోవాలని నిన్న హామీ ఇచ్చాను. ఆ బాధ్యతను నెరవేర్చకుండా వెళ్లడం నీతికి తగదు,’’ అని పవన్‌ కల్యాణ్‌ గారు తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. మన్యంలో షెడ్యూల్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు ఆయన పట్టుదలతో ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం, మరియు ఆరోగ్య శిబిరాల ఏర్పాటు వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఆయన విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి సింగపూర్‌కు బయలుదేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సింగపూర్‌ బయల్దేరిన పవన్‌ కుటుంబం
కుమారుడికి గాయాల విషయం తెలియగానే పవన్‌ కుటుంబం సింగపూర్‌ బయల్దేరి వెళ్లింది. అయితే మార్క్‌ శంకర్‌ పరిస్థితి నిలకడగా ఉండటంతో కొంత ఊరట కలిగింది. సింగపూర్‌లోని వైద్య బృందం మార్క్‌ శంకర్‌కు అత్యుత్తమ చికిత్స అందిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు తన అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి ప్రార్థనలు చేయాలని కోరినట్లు సమాచారం.

 

Also Read: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ‘పెద్ది’..కళ్ళుచెదిరే బిజినెస్ ఆఫర్స్!

Get notified whenever we post something new!

Continue reading

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. జియో ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున నెలకు...

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక ప్రాతినిధ్యం కలిగి ఉంది. పశ్చిమ భారతదేశం మొత్తం కలిపినా ఇంతకంటే తక్కువ స్థానాలు ఉంటాయి. తూర్పు భారతదేశం సీట్ల సంఖ్యతో...

Narendra Modi: మోడీ దెబ్బకు మొత్తం మారిపోయింది

Narendra Modi: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నిన్నటి వ్యతిరేకులు ఈరోజు స్నేహితులుగా మారడం, వ్యతిరేక పార్టీలు చేతులు కలపడం సాధారణం. లోక్‌సభ, రాజ్యసభ స్వరూపం ఇప్పుడు గత సమావేశాల కంటే చాలా వేరుగా ఉంది. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ మారుతోంది, ఓటింగ్‌ సమీకరణలు మారుతున్నాయి. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, డీలిమిటేషన్‌...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version