Mahesh SSMB28 : వెనుక లారీలు.. ముందు రౌడీలు.. మహేష్-త్రివిక్రమ్ కథేంటి?

Mahesh SSMB28  మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఫ్యాన్స్ లో హైప్ ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేసిన అతడు, ఖలేజా పిచ్చ కిక్ ఇచ్చాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ మహేష్ ని ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా అయ్యారు. ఆ కాంబో 13 ఏళ్ల తర్వాత సాకారం అయ్యింది. ఖలేజా 2010లో విడుదల కాగా… ఇప్పటికి మరో చిత్రానికి వీరిద్దరూ కలిశారు. ఇక ఈ చిత్ర కథ, టైటిల్ పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ప్రముఖంగా […]

Written By: NARESH, Updated On : March 26, 2023 7:11 pm
Follow us on

Mahesh SSMB28  మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఫ్యాన్స్ లో హైప్ ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేసిన అతడు, ఖలేజా పిచ్చ కిక్ ఇచ్చాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ మహేష్ ని ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా అయ్యారు. ఆ కాంబో 13 ఏళ్ల తర్వాత సాకారం అయ్యింది. ఖలేజా 2010లో విడుదల కాగా… ఇప్పటికి మరో చిత్రానికి వీరిద్దరూ కలిశారు. ఇక ఈ చిత్ర కథ, టైటిల్ పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. ప్రముఖంగా మూడు టైటిల్స్ వినిపించాయి. అమ్మ మాట, గుంటూరు కారం, అమరావతికి అటు ఇటు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఉగాదికి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. ఆ రోజు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ విడుదల చేస్తారని ఆశపడ్డారు. అనూహ్యంగా చడీ చప్పుడు లేకుండా మార్చి 26 సాయంత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ఎం28 ఫస్ట్ లుక్ చూస్తే అనేక ఊహలు మెదులుతున్నాయి. ప్రచారంలో ఉన్న టైటిల్స్ కి ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా దగ్గర సంబంధం కనిపిస్తుంది. అయితే మహేష్ ఊర మాస్ లుక్ ఊహించలేదు. బీడీ తాగుతూ ఆయన స్టైల్ గా నడిచొస్తుంటే రౌడీలు కంగారుగా చూస్తున్నారు.

అది ఓ ఫైట్ సీక్వెన్స్ లోని మహేష్ స్టిల్ అని అర్థం అవుతుంది. మహేష్ కొడుతుంటే ఒక్కొక్కడు గాల్లోకి ఎగురుతున్నారు. మిరపకాయలు చెల్లాచెదురు అవుతున్నాయి. ఈ చిత్రం టైటిల్స్ గా త్రివిక్రమ్ గుంటూరు మిర్చి, అమరావతికి అటు ఇటు అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పోస్టర్ కూడా అదే చెబుతుంది. ఇది గుంటూరు ఏరియా, ముఖ్యంగా మిర్చి యార్డు నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావచ్చు. కమర్షియల్ చిత్రానికి త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి తెరకెక్కించారనిపిస్తుంది.

మొత్తంగా పోస్టర్ దుమ్మురేపింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే విడుదల ఆగస్టు నుండి ఏకంగా 2024 జనవరి 13కి షిఫ్ట్ చేశారు. జనవరి 12న ప్రాజెక్ట్ కే విడుదల ఉంది. అంటే వచ్చే సంక్రాంతికి ప్రభాస్-మహేష్ బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు. సూర్యదేవర నాగవంశీ ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.