ఆంధ్రప్రదేశ్‌Mahanadu 2025: మహానాడులో సంచలనాలు.. లోకేష్ కు పట్టాభిషేకం.. కరెక్ట్ సమయం అంటున్న క్యాడర్!

Mahanadu 2025: మహానాడులో సంచలనాలు.. లోకేష్ కు పట్టాభిషేకం.. కరెక్ట్ సమయం అంటున్న క్యాడర్!

Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) మహానాడు పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ నిలబడేలా దిశా నిర్దేశం చేయనుంది ఈ మహానాడు. ముఖ్యంగా లోకేష్ ప్రాధాన్యత పెంచనుంది. ఈ మహానాడులో కీలక రాజకీయ తీర్మానాలు ఉండబోతున్నాయి అన్నది హాట్ టాపిక్ అవుతోంది. టిడిపి చరిత్రలోనే ఎన్నడూ నిర్వహించని కడపలో మహానాడు నిర్వహిస్తుండడం నిజంగా విశేషమే. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ సొంత ఇలాకాలో పసుపు పండుగ నిర్వహిస్తోంది. ఇదే పండుగలో నారా లోకేష్ కి పార్టీ పరంగా ప్రమోషన్ లభిస్తుందన్న ప్రచారం తమ్ముళ్లలో జోష్ నింపుతోంది.

Also Read: రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. వెంటనే ఇలా చేయండి.. అకౌంట్లో డబ్బులు పడతాయి..

* దశాబ్దాలుగా సేవలు..
ప్రత్యక్ష రాజకీయాలను 2014లో ప్రారంభించారు నారా లోకేష్( Nara Lokesh). కానీ అంతకుముందు.. 2009 ఎన్నికల్లో వెనుకుండి నడిపించారు. నగదు రహిత సంక్షేమ పథకాలు అమలు చేయాలని అప్పుడే చెప్పిన ఘనత నారా లోకేష్ ది. అయితే అప్పట్లో త్రిముఖ పోటీలో మహాకూటమిగా వెళ్లిన టిడిపికి అపజయం ఎదురయింది. అటు తరువాత 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ టిడిపి గెలుపులో కీలక భాగస్వామ్యం అయ్యారు. అటు తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో చేరి రాజకీయ ఓనమాలు దిద్దుకున్నారు. ఎన్నెన్నో సంక్షోభాలను అధిగమించారు. అవమానాలు తట్టుకొని నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో అత్యంత సాహసవంతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ టిడిపి గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిన చోట నిలబడాలని భావించారు. ఐదేళ్లపాటు మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేశారు. దీంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు 90 వేల ఓట్ల మెజారిటీతో నారా లోకేష్ ను గెలిపించుకున్నారు.

* టిడిపిలో తనదైన ముద్ర..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు నారా లోకేష్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu) బిజీగా ఉన్న తరుణంలో అన్ని తానై వ్యవహరిస్తూ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తూ వచ్చారు. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అందుకే టిడిపిలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక కానంద్ అన్న ప్రచారం జోరు అందుకుంది. నారా లోకేష్ కు ప్రమోషన్ పై టీడీపీలో ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పబోతోంది. టిడిపి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమించే ఛాన్స్ ఉందని పార్టీలో బలమైన చర్చ నడుస్తోంది.

* యూత్ లో క్రేజ్..
నారా లోకేష్ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలన్న ఆలోచనలు సీనియర్లు ఉన్నారు. పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోను యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ ను మరింత ఎలివేట్ చేయడానికి ఈ కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలోనే డిమాండ్లు వినిపించాయి. అయితే కూటమిలో సమన్వయానికి ఇబ్బందులు తలెత్తడంతో అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా పార్టీలో లోకేష్ ను ప్రమోట్ చేయాలని.. ప్రభుత్వంలో తానంతట తానే అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ సైతం స్పీడ్ పెంచారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పనితీరే చెబుతోంది. ప్రధానంగా విద్యావంతులను ఆకర్షించడం ద్వారా ఒక సరికొత్త ఆవిష్కరణ చేసుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీలో భావి నాయకుడిగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు సీనియర్లు రావడం విశేషం. అందుకే మహానాడు మరింత అంచనాలు పెంచేస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

YSRCP: పార్లమెంట్ లో వైసీపీ శాంతి మంత్రం.. దేకినోడు లేడు..

YSRCP: దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా ఇప్పుడు పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు కూడా మొదలయ్యాయి. ప్రజలు ఎన్నుకున్న...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version