Homeక్రీడలుIndia Vs Australia- Modi And Albanese: ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్: రోహిత్, స్మిత్ లను ఆశ్చర్యపరిచిన...

India Vs Australia- Modi And Albanese: ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్: రోహిత్, స్మిత్ లను ఆశ్చర్యపరిచిన ప్రధానులు మోడీ, ఆల్బనీస్!

India Vs Australia- Modi And Albanese
India Vs Australia- Modi And Albanese

India Vs Australia- Modi And Albanese: బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌–ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక చివరి ‘టెస్ట్‌’ గురువారం అహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్రమోదీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తిలకించేందుకు ఇరు దేశాల ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 75 ఏళ్ల భారత్‌–ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌ తొలి రోజు ఆట చూసేందుకు మైదానానికి వచ్చారు. ఇద్దరు ప్రధానులకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, సెక్రెటరీ జైషా ఘన స్వాగతం పలికారు. ప్రధానులిద్దర్నీ ఘనంగా సత్కరించారు. మోదీకి జైషా ఆయన ఫొటోతో కూడిన జ్ఞాపికను అందజేయగా.. ఆల్బనీస్‌కు బిన్నీ ఆయన ఫొటోతో ఉన్న జ్ఞాపికను ఇచ్చారు.

ఫ్రెండ్‌షిప్‌ ఇలానే..
అనంతరం ఇద్దరు ప్రధానులు తమ కెప్టెన్లకు టెస్ట్‌ క్యాప్‌ అందజేశారు. ప్రధాని మోదీ భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు టెస్ట్‌ క్యాప్‌ ఇవ్వగా.. స్మిత్‌కు ఆల్బనీస్‌ అందజేశాడు. వెంటనే మోదీ స్మిత్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి.. ఆసీస్‌ ప్రధానితోపాటు రోహిత్‌ శర్మ చేతులను పైకెత్తి తమ స్నేహం ఇలానే కొనసాగాలని చాటిచెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్‌ కారులో స్టేడియం మొత్తం తిరిగి అభిమానులకు అభివాదం చేశారు.

ఫొటో గ్యాలరీ..
నరేంద్ర మోదీ టాస్‌ కాయిన్‌ ఎగరవేస్తాడని ప్రచారం జరిగినా.. ప్రధానులు ఆటలో భాగమవ్వలేదు. మైదానంలో తిరిగిన అనంతరం స్టేడియం లోపలి నిర్మాణాలను పరిశీలించారు. టీమిండియా సాధించిన విజయాలతోపాటు మైదానం లోపల ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలను తిలకరించారు. మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి.. ఇరు దేశాల ప్రధానులకు ఆ ఫొటోల వివరాలను వివరించాడు. టాస్‌ అనంతరం ఇరు దేశాల ఆటగాళ్లతో ప్రధానులు మైదానంలోకి వచ్చి జాతీయా గీతాలను ఆలపించారు. ప్రధాని నరేంద్రమోదీ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ వరుసగా నిలబడ్డారు. జాతీయ గీతాలపన అనంతరం ఇరు దేశాల ప్రధానులు ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు.

India Vs Australia- Modi And Albanese
India Vs Australia- Modi And Albanese

టాస్‌ ఓడిన రోహిత్‌శర్మ..
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆసీస్‌ తాత్కలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్‌ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన స్మిత్‌.. గత మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని గుర్తు చేశాడు.

టీమిండియాలో ఒక మార్పు..
మరోవైపు టాస్‌ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్‌ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఏం చేయాలో తమకు తెలుసని, తుది జట్టులో ఒక మార్పు చేశామని రోహిత్‌ వెల్లడించాడు. సిరాజ్‌కు విశ్రాంతివ్వగా.. మహ్మద్‌ షమీ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. గత మ్యాచ్‌ ఓటమి అనంతరం తాము సమావేశమై తమ లోపాలపై చర్చించుకున్నామని చెప్పాడు. గత మూడు మ్యాచ్‌ల్లో పిచ్‌ ఒక్కటే ఫలితాలను శాసించలేదని, చాలా అంశాలున్నాయని చెప్పాడు రోహిత్‌. ఈ పిచ్‌.. ఐదు రోజులు ఒకేలా ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపాడు.

 

పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై ప్రేమ రాజకీయాల కతీతం || Hats off to Pawan Kalyan || Ok Telugu

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version