spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Avanthi Srinivas Rao: అవంతి.. ఇక వైసీపీ చేజారే బంతియేనా?

Avanthi Srinivas Rao: అవంతి.. ఇక వైసీపీ చేజారే బంతియేనా?

Avanthi Srinivas Rao
Avanthi Srinivas Rao

Avanthi Srinivas Rao: విశాఖ కు చెందిన తాజా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యవహార శైలి వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఆయన అధికార పార్టీకి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. ప్రజారాజ్యం బ్యాచ్ కు చెందిన ఈయన అనూహ్య నిర్ణయాలతో యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. చిరంజీవి పీఆర్పీతో రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా మారారు. 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీ టిక్కెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఐదేళ్ల పాటు ఎంపీ పదవి దక్కించుకున్నారు. గత ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు. ముందు మాట్లాడుకున్నట్టుగా భీమిలి టిక్కెట్ తో పాటు మంత్రి పదవి సైతం పొందారు. మొన్నటి పునర్విభజనతో మంత్రి పదవి పోగొట్టుకున్నారు. అటు తరువాత విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి దూరమైంది. దీంతో ఆయన పునరాలోచనలో పడినట్టు వార్తలు వస్తున్నాయి.

పదవులు దూరం కావడంతో మనస్తాపం..
మంత్రి పదవి పోయినా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి పోవడాన్ని అవంతి జీర్ణించుకోలేకపోతున్నారు. అటు భీమిలి అసెంబ్లీ స్థానం టిక్కెట్ డౌటే అన్న ప్రచారం సాగుతోంది. అక్కడ అవంతి వ్యతిరేక వర్గం పట్టుబిగుస్తోంది. అటు భీమిలిలో జనసేన సైతం గ్రాఫ్ పెంచుకుంటూ వస్తోంది. చివరకు అవంతి అనుచరులు సైతం జనసేనలో చేరుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఒక ఎత్తు అయితే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో ఎంట్రీ అవంతికి నచ్చడం లేదు. ఇలా వచ్చిన పంచకర్ల కు పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. అది కూడా తన వద్ద తీసుకొని మరీ కట్టబెట్టారు. అప్పటికే మంత్రి పదవి పోయిన బాధతో ఉన్న అవంతి దీనిని ఒక అవమానంగా భావించారు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్ నడుస్తోంది. తరచూ పార్టీ కార్యక్రమాలకు గైర్హజరవుతుండడం అనుమానాలను పెంచుతోంది.

పీఆర్పీతో ఎంట్రీ..
పీఆర్పీ తరుపన 2009లో అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అవంతి భీమిలి నుంచి.. పంచకర్ల పెందుర్తి నుంచి పోటీచేశారు. అదే సమయంలో గంటా శ్రీనివాసరావు సైతం పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పీఆర్పీని కాంగ్రెస్ లోకి విలీనం చేసే సమయంలో గంటాకు మంత్రి పదవి దక్కింది. 2014 ఎన్నికలకు ముందు ఈ ముగ్గురూ టీడీపీలో చేరారు. కానీ అప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిని గంటా కోసం అవంతి వదులుకున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేశారు. భీమిలి నుంచి గెలిచిన గంటా మంత్రి అయ్యారు. మంత్రి కావాలన్న తన కలను గంటా అడ్డంకిగా మారారని చెప్పి ముందస్తు అవగాహన మేరకు అవంతి వైసీపీలో చేరి..ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అందుకే తాను మంత్రిగా ఉన్నన్నాళ్లూ గంటాను వైసీపీలోకి రాకుండా అడ్డుకోగలిగారు.

Avanthi Srinivas Rao
Avanthi Srinivas Rao

పక్కలో బల్లెంలా పంచకర్ల..
అయితే గంటా విషయంలో సక్సెస్ అయిన అవంతి పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరకుండా అడ్డుకోలేకపోయారు. పైగా వైసీపీ హైకమాండ్ రమేష్ బాబును పిలవడమే కాకుండా జిల్లా అధ్యక్ష స్థానాన్ని కట్టబెట్టింది. మంత్రి పదవి పోవడంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు కొనసాగిస్తారని అవంతి భావించారు. కానీ తన నుంచి పదవి తీసుకొని రమేష్ బాబుకు అప్పగించారు.పైగా వచ్చే ఎన్నికల్లోఅతడికి టిక్కెట్ ఇచ్చి మంత్రిని చేస్తారన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో అవంతికి భీమిలి టిక్కెట్ డౌటేనన్న ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటుండడంతో అవంతి పునరాలోచనలో పడ్డారు. పార్టీ మారడంపై కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు నెలల్లో ఏ పార్టీలో చేరుతారనే దానిపై క్లారిటీ రానుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...

Three Sisters Marry One Man: ఒక యువకుడితో ముగ్గురు పెళ్లి చేసుకుందే కాక.. దారుణం.. ఇది ఊహించని...

Three Sisters Marry One Man: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే.. ముగ్గురు అక్కా చెల్లెళ్లు మాత్రం మీడియం మొత్తం తన వైపు తిప్పుకున్నారు. తమ గురించి మాట్లాడుకునే...
Oktelugu Epaper
Exit mobile version