spot_img
Homeట్రెండింగ్ న్యూస్Bihar: గయలో ఉక్రెయిన్‌ మహిళ పిండప్రదానం.. ఎవరి కోసమో తెలిస్తే కళ్లు చెమరుస్తాయి?

Bihar: గయలో ఉక్రెయిన్‌ మహిళ పిండప్రదానం.. ఎవరి కోసమో తెలిస్తే కళ్లు చెమరుస్తాయి?

Bihar: పిత్రుపక్షం.. దీనికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పక్షంలో చనిపోయన వారికి పిండప్రదానం చేస్తే మంచిదని నమ్ముతారు. పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయని, పిత్రుదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈనెల 15 వరకు పిత్రుపక్షాలు ఉన్నాయి. దీంతో దేశంలోని పవిత్రమైన గంగ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరీ, సరయు నదీతీరాల్లో పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. అయితే బిహార్‌లోని గయకు ఓ విదేశీ మహిల వచ్చి పిండప్రదానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో ఆమె ఎవరి కోసం ఈ కార్యం నిర్వహించిందో తెలుసుకుందాం.

యుద్ధ వీరుల కోసం..
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య దాదాపు ఏడాదిన్నరగా యుద్ధం కొనసాగుతోంది. ఇందులో తమ దేశం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వీర జవాన్లు, ప్రజలతోపాటు తన పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఆ దేశ సైకాలజిస్ట్‌ జూలియా(33) ‘పిండాన్‌’ చేయాలని బీహార్‌లోని గయకు వచ్చింది. యుద్ధంలో మరణించిన సైనికులతోపాటు సామాన్య ప్రజల ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం నదీ తీరంలో పిండప్రదానం చేసింది. జూలియాతోపాటు రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, లిసా, యూకే నుంచి 35 మంది యాత్రీకులు ఇక్కడికి వచ్చారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
గయలో యుక్రెయిన్‌ మహిళ తమ దేశ సైనికులు, సామాన్య ప్రజల కోసం హిందూ సంప్రదాయ పద్ధతిలో పిండప్రదానం చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న ఆర్టర్, జూలియా మాట్లాడుతూ, ‘ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పటికే రెండు వైపుల నుండి చాలా కన్నీళ్లు వచ్చాయి.

చాలా బాధగా ఉంది. చలికాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. శాంతి కోసం ప్రార్థిద్దాం’ ‘ఉక్రెయిన్‌లోని హిందూ జాగరణ్‌ సమితికి అనుబంధంగా ఉన్న నా ఆధ్యాత్మిక గురువు నటల్య సఫ్రోనోవా నుండి నేను దాని గురించి తెలుసుకున్నాను. పూర్వీకులకు గౌరవం ఇవ్వడానికి ఇది ఉత్తమ మార్గం. నేను 2012లో కూడా ఇక్కడకు వచ్చాను’ అని తెలిపింది. దీనిని చూసిన నెటిజన్లు సదరు మహిళను అభినందిస్తున్నారు. తమ దేశ పౌరులు, సైనికులు అర్ధంతరంగా తనువు చాలంచారని, వారి ఆత్మశాంతించాలని హిందూ సంప్రదాయం ప్రకారం పిండప్రదానం చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మణిపూర్‌ అల్లర్ల మృతుల కోసం..
మరోవైపు, ఒక సామాజిక కార్యకర్త, చందన్‌ కుమార్‌ సింగ్, వేలాది మంది అజ్ఞాత నిష్క్రమించిన ఆత్మలకు శాంతి కోసం సామూహిక పిండప్రదానం చేశారు. వారిని వారు ఎప్పుడు కలవలేదు. మణిపూర్‌ హింసాకాండలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ‘తర్పణ్‌‘ అందించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version