Veerasimha Reddy : ఓటీటీ రికార్డ్స్ ని తిరగరాసిన బాలయ్య ‘వీర సింహా రెడ్డి’.. ‘అఖండ’కి మించిన వ్యూస్ తో నయా రికార్డు

Veerasimha Reddy  OTT : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఇటీవలే విడుదలై, కమర్షియల్ గా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. అందుకే ఓపెనింగ్స్ బాలయ్య అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా 30 కోట్ల రూపాయలకు […]

Written By: NARESH, Updated On : February 23, 2023 9:07 pm
Follow us on

Veerasimha Reddy  OTT : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీర సింహా రెడ్డి’ ఇటీవలే విడుదలై, కమర్షియల్ గా సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మొదటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. అందుకే ఓపెనింగ్స్ బాలయ్య అభిమానులు కలలో కూడా ఊహించని విధంగా 30 కోట్ల రూపాయలకు పైగా భారీ వసూళ్లను మొదటిరోజే రాబట్టింది.

కానీ ఫుల్ రన్ లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వసూళ్లకు దరిదాపుల్లోకి రాలేకపోయినా పండగ సెలవుల్లో బాగా ఆడింది. సుమారుగా 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చిన ఈ చిత్రాన్ని నేడు ఓటీటీ లో విడుదల చేసారు. డిస్నీ + హాట్ స్టార్ సంస్థ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

‘అఖండ’ చిత్రానికి ఇక్కడ రికార్డు స్థాయి వ్యూస్ రావడం తో ‘వీర సింహా రెడ్డి’ డిజిటల్ రైట్స్ ని పోటీపడి మరీ దక్కించుకుంది డిస్నీ+ హాట్ స్టార్ సంస్థ. గత కొద్దీ రోజుల నుండి ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో చేసారు.బాలయ్య బాబు చేత ఈ సినిమా హాట్ స్టార్ లో చూడండి అంటూ ఒక ప్రత్యేకమైన వీడియో ని కూడా చేయించారు.అలా భారీ హైప్ తో ఓటీటీ లో విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ కి కొన్ని అరుదైన రికార్డ్స్ వచ్చాయట.

ఈ సినిమాని అప్లోడ్ చేసిన గంటలోనే రెండు మిలియన్ కి పైగా వ్వాచ్ మినిట్స్ వచ్చాయట.ఇది తెలుగు సినిమాలలో ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అంతే కాదు ఈ సినిమాకి 24 గంటల్లో 50 మిలియన్ వాచ్ మినిట్స్ కచ్చితంగా వస్తాయని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి అభిమానుల అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది.