spot_img
Homeట్రెండింగ్ న్యూస్Tamil Nadu Hospital: తమిళనాడులో దారుణం.. రూ.5 వేలకు ఒకరి చొప్పున 300 మందిని చంపేశాడు..!?

Tamil Nadu Hospital: తమిళనాడులో దారుణం.. రూ.5 వేలకు ఒకరి చొప్పున 300 మందిని చంపేశాడు..!?

Tamil Nadu Hospital
Tamil Nadu Hospital

Tamil Nadu Hospital: పదేళ్లుగా ఓ సైకో.. దాదాపు 300 మంది రోగులను హత్య చేశాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.. ఆ వీడియో ఇప్పుడు తమిళనాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంధువులు, కుటుంబసభ్యుల సూచన మేరకే..

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో అటుతిరిగి ఇటు తిరిగి పోలీసులకు చేరింది. ఆ వీడియో ఆధారంగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు వెల్లడించారు. నామక్కల్‌ జిల్లా పల్లి పాలయానికి చెందిన మోహన్‌రాజ్‌ (34) స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిత్యం సంచరించేవాడు. శవాగారం వద్ద పని చేస్తున్న వ్యక్తితో కలిసి అతడు చెప్పే పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో 18వ తేదీన సామాజిక మాధ్యమాల్లో అతడు హత్యలు చేసినట్లు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.

విషపు సూది ఇచ్చి..
వయోభారం, ఆరోగ్యం క్షీణించిన రోగులకు వారి కుటుంబసభ్యులు, బంధువుల కోరిక మేరకు సూదితో విషపు మందు వేసి హత్య చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. దీనికి రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇలా దాదాపు 300 మందిని పదేళ్లలో హత్య చేసినట్టు మోహన్‌రాజ్‌ పేర్కొన్నాడు. చెన్నై, బెంగళూరులో కూడా ఈ తరహా పనులకు వెళ్లానని చెప్పాడు. రూ.5 వేలు ఇస్తే రెండు నిమిషాలలో పని పూర్తి చేస్తానని పేర్కొన్నాడు.

Tamil Nadu Hospital
Tamil Nadu Hospital

వీడియో ఆధారంగా విచారణ..
రోగుల హత్య విషయం మోహన్ రాజ్. మృతుల కుటుంబాలకు మినహా ఈ అరికీ తెలియదు. తాజాగా మోహన్ రాజ్ వీడియో వైరల్‌ కావడంతో పళ్లిపాలయం పోలీసులు కేసు నమోదు చేసి, మోహన్‌రాజ్‌ని అరెస్టు చేశారు. మద్యం మత్తులో తాను అలా మాట్లాడినట్లు అతను దర్యాప్తులో పేర్కొనడం గమనార్హం.
ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 18 మంది నకిలీ వైద్యులతోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తాగిన మైకంలో రూ.5 వేల కోసం 300 మంది రోగుల ప్రాణాలు తీయడం సంచలనంగా మారింది. రోగులకు సపర్యలు చేయలేనివారు తమ చేతికి మట్టి అంటకుండా అయిన వాళ్లనే వదిలించుకోవడం విషాదకరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version