Anchor Anasuya Bharadwaj: బుల్లితెర మీద టాప్ లీడింగ్ యాంకర్స్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉంటుంది అనసూయ.జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైనా అనసూయ, ఆ షో ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించింది.ఆ తర్వాత ఈమెకి బుల్లితెర యాంకర్ గా ఇతర ఛానెల్స్ లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి.అలా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమెకి సినిమాల్లో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి.
Also Read: Jathi Ratnalu: షాకింగ్..’జాతి రత్నాలు’ సినిమా ఆ చిత్రానికి రీమేకా..? ఇన్ని రోజులు తెలియలేదే!
క్షణం సినిమా ద్వారా వెండితెర పై కనిపించిన అనసూయ, ఆ తర్వాత రంగస్థలం మరియు పుష్ప వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది.పుష్ప సినిమా తో అయితే ఆమె ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించింది.పుష్ప పార్ట్ 2 లో కూడా ఆమె క్యారక్టర్ నిడివి చాలా పెద్దది గా ఉండబోతుందట.అలా బుల్లితెర , వెండితెర పై దూసుకుపోతున్న అనసూయ కెరీర్ ఇప్పుడు బాగా డౌన్ అయ్యింది.
ఈమధ్య ఆమె అటు సినిమాల్లోనూ కనిపించడం లేదు, ఇటు బుల్లితెర మీద కూడా సందడి చెయ్యడం లేదు.దీనితో అసలు అనసూయ కి ఏమైంది,ఆమె స్పీడ్ బాగా తగ్గిపోయిందే అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది.ఆమె స్పీడ్ తగ్గడానికి కారణం వ్యాపారాల్లో తలదూర్చడమే అని తెలుస్తుంది.ఇటీవలే ఈమె ఒక వ్యక్తిని నమ్మి వ్యాపారం లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిందట.కానీ చివరికి ఆ వ్యాపారం లో నష్టాలు రావడం తో కోట్ల రూపాయిలు అప్పుల పాలైందట.ఇప్పుడు ఆ అప్పులను తీర్చడానికి ఆమె ఇన్నాళ్లు ఎంతో కస్టపడి సంపాదించుకున్న ఆస్తులను అమ్మేయబోతున్నట్టు ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది.
రీసెంట్ గానే బంజారా హిల్స్ లో కోట్ల రూపాయిలు విలువ చేసే ఒక స్థలం ని అమ్మకానికి పెట్టిందట, ఆ స్థలం విలువ 30 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం.ఇలా అంత పెద్ద హోదాలో ఉన్న అనసూయ అప్పులు తీర్చడం కోసం ఆస్తులను అమ్మకానికి పెట్టడం పై అభిమానులు సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ravanasura Movie Teaser : రావణాసుర టీజర్: రవితేజ ఈసారి విలనిజంలో రావణాసురతత్వం