Homeఎంటర్టైన్మెంట్Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ పై జోకులు వేశారు: ఆ హీరో మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ పై జోకులు వేశారు: ఆ హీరో మధ్యలోనే లేచి వెళ్లిపోయాడు

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ భారతీయ వెండితెరకు పరిచయం అక్కరలేని నటుడు. అమితాబ్ అంటే ఏమిటో షోలే, జంజీర్, బ్లాక్, పీకూ, పింక్ చిత్రాలు చెబుతాయి. ఇప్పటికీ ఆయన నటిస్తూనే ఉన్నారు. తన వయసుకు తగ్గ పాత్రలు వేస్తూ కుర్రకారుకు పోటీ ఇస్తున్నారు. అటువంటి మేటి నటుడు కాబట్టే విశ్వవిఖ్యాతమైన పురస్కారాలు ఆయన పాదాక్రాంతమయ్యాయి. నటుడిగా మాత్రమే కాకుండా అద్భుతమైన వ్యాఖ్యాతగా ఆయన బుల్లితెరకు పరిచయం. కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ ఒక్క కార్యక్రమం చాలు అమితాబ్ స్టామినా ఏంటో చెప్పేందుకు.. కానీ అలాంటి విశ్వవిఖ్యాత నటుడి పై కొంతమంది కుళ్ళు జోకులు వేశారు. ఇదంతా చూస్తున్న మరో నటుడు ఆ వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఆ కార్యక్రమం మధ్యలో నుంచే లేచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఏమిటా కథ!

Amitabh Bachchan
Amitabh Bachchan, abhishek bachchan

నేను ఫూల్ కాదు

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వ్యక్తి అభిషేక్ బచ్చన్. భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత కూలెస్ట్ యాక్టర్. ఏ విషయంలోనూ పెద్దగా స్పందించని అతడు.. ఈమధ్య ఒక విషయంలో మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. తాజాగా తన తండ్రి అమితాబ్ పై జోక్ వేయడంతో షో సెట్ నుంచి అభిషేక్ వాకౌట్ చేశాడు. నేనేమీ ఫూల్ కాదని వారికి చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని నిర్వాహకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనతో ఆ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, కపిల కుశ షాక్ అయ్యారు. హిందీలోని ఒక ఛానల్ లో కేస్ తో బన్ తా హై అనే ఒక కార్యక్రమం ప్రసారమవుతున్నది. దీనికి రితేష్, కపిల కుశ హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షో అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా ఈ మధ్య అభిషేక్ బచ్చన్ వచ్చాడు. ఇందులో భాగంగా పరిదోష్ త్రిపాఠి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పై ఒక జోక్ వేశాడు.

Amitabh Bachchan
Amitabh Bachchan

దీంతో జూనియర్ బచ్చన్ ఆగ్రహానికి గురయ్యాడు..” నేను ఈ షోలో పాల్గొనేందుకు వచ్చాను. ఏమైనా ఉంటే నాతో మాట్లాడండి. జోకులు నామీద వేయండి. అంతేకానీ ఎటువంటి సంబంధం లేని నా తల్లిదండ్రులను ఇందులోకి లాగకండి. మీరు హద్దులు మీరు ప్రవర్తించకండి. నా తండ్రి మీద జోక్స్ వేస్తే నాకు అసలు నచ్చదు” అభిషేక్ బచ్చన్ ఫైర్ అయ్యాడు. జూనియర్ బచ్చన్ కు సర్ది చెప్పేందుకు పరితోష్ ప్రయత్నించాడు. పరిస్థితులను చక్కదిద్దేందుకు కేస్ తో బన్ హై నిర్వాహకులు ప్రయత్నించారు. అయినప్పటికీ అభిషేక్ వెనక్కి తగ్గలేదు. షూటింగ్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. ఈ టాక్ షో కు గతంలో చాలామంది సెలబ్రిటీలు వచ్చారు.. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్, సంజయ్ దత్, అనీల్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా ఆరోరా వంటి వారు టాక్ షోలో పాల్గొని సందడి చేశారు. కానీ తన తండ్రి పై జోకులు వేయడంతో అభిషేక్ బచ్చన్ షో మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడు. ఈ వివాదం బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. కానీ ఇంతవరకు దీనిపై అమితాబచ్చన్ నోరు మెదపకపోవడం గమనార్హం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version