Ramadan: ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో రంజాన్ పండుగ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి ముస్లింలు రోజా పాటిస్తారనే సంగతి తెలిసిందే. ముస్లింలు రంజాన్ మాసం సమయంలో తెల్లవారుజామున భోజనం చేసిన తర్వాత సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోరు. రోజులో ముస్లింలు కనీసం 14 గంటల పాటు ఆహారానికి, మంచినీళ్లకు కూడా దూరంగా ఉంటారు.
అయితే ఉపవాసం చేయడం వల్ల కొన్నిసార్లు నీరసంగా అనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. రంజాన్ మాసంలో సెహరీ, ఇఫ్తార్ సమయాలలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు. ముస్లింలు సెహరీ, ఇఫ్తార్ సమయాలలో నీటితో నిండి ఉండే పండ్లలో ఒకటైన బ్లాక్ బెర్రీ పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. హైడ్రేటింగ్ స్నాక్ పేరుతో పిలిచే బ్లాక్ బెర్రీ పండ్లు విటమిన్ సి, కె, ఫైబర్ లను కలిగి ఉండటంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిలో పెరుగు ఒకటనే సంగతి తెలిసిందే. పెరుగు శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు శరీరానికి అవసరమైన ప్రోటీన్, క్యాల్షియంలను కలిగి ఉంటుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవాళ్లు సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పాలు తీసుకుంటే మంచిది. పాల ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియం లభిస్తుంది. సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పళ్ల రసాలను తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ చేకూరుతాయి.
సెహరీ, ఇఫ్తార్ సమయాలలో పుచ్చకాయ, కొబ్బరినీళ్లు తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More