spot_img
Homeటెలివిజన్‌Vindhya Vishaka: పిల్లల్ని కనకపోయినా పేర్లదు, బాగా ఎంజాయ్ చేయమని అమ్మ చెప్పింది... స్టార్ యాంకర్...

Vindhya Vishaka: పిల్లల్ని కనకపోయినా పేర్లదు, బాగా ఎంజాయ్ చేయమని అమ్మ చెప్పింది… స్టార్ యాంకర్ వింధ్య విశాఖ షాకింగ్ కామెంట్స్

Vindhya Vishaka: స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత మా మ్యూజిక్, హెచ్ఎం టీవీ లలో పని చేసి గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా స్పోర్ట్స్ ఛానల్స్ లో తెలుగు ఫిమేల్ యాంకర్ గా రాణిస్తుంది. తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో వింధ్య హవా నడుస్తోంది. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి వింధ్య పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముఖ్యంగా తన తల్లిదండ్రులు తనని ఎలా పెంచారో చెప్పుకొచ్చింది.

వింధ్య మాట్లాడుతూ .. ” మా అమ్మ బాగా చదువుకుంది. మా నాన్న రైతు. ఆయన ఆస్థి పరుడని అమ్మను ఇచ్చి పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టారని బాధపడుతూ ఉంటుంది. మా అమ్మ నాకు ఒకే మాట చెప్తుంది. నువ్వు సొసైటీ కోసం ఆలోచించకు. ఈ ఏజ్ కి పెళ్లి చేసుకోవాలి. ఈ ఏజ్ లో పిల్లల్ని కనాలి. ఇలాంటి బట్టలు వేసుకోవాలి. ఇలాగే ఉండాలి వంటి ఆలోచనలు బ్రెయిన్ లో నుంచి తీసేయ్.

మేము ఏదైతే ఎంజాయ్ చేయలేకపోయామో .. నువ్వు ఎంజాయ్ చేయాలి. నువ్వు పిల్లల్ని కనకపోయినా పర్లేదు .. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్ .. నీకు నచ్చినట్టు ఉండు. ఎవరో ఏదో అన్నారని నీ ఇష్టాలను వదులుకోకు అని చెప్తుంది. పైగా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అని .. నీ క్యారెక్టర్ ని నువ్వు కోల్పోకు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్ .. ఎంజాయ్ చెయ్ అని చెప్తారు.

చిన్నప్పటి నుంచి అది చెయ్ .. ఇది చేయకు అని చెప్పలేదు” అన్నారు. వింధ్య విశాఖ కు ఫిమేల్ యాంకర్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సోషల్ మీడియాలో సైతం ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రో కబడ్డీ, ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కి వింధ్య విశాఖ తెలుగు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కూడా అయ్యాయని గతంలో చెప్పడం విశేషం..

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version