spot_img
Homeజాతీయ వార్తలుTelangana Politics: కిషన్ రెడ్డి నియామకానికి కేసీఆర్ కృషి

Telangana Politics: కిషన్ రెడ్డి నియామకానికి కేసీఆర్ కృషి

Telangana Politics: కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దూకుడు ప్రదర్శిస్తోంది. భారత రాష్ట్ర సమితికి చెందిన నేతలందరినీ ఆకర్షిస్తున్నది.. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన బలమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును లాగేసుకుంది. అంతేకాదు మరి కొంతమందిని పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. దీనికి తోడు ఖమ్మం లో రాహుల్ గాంధీని ప్రత్యేక అతిథిగా తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ఏకంగా నాలుగు లక్షల మంది దాకా కార్యకర్తలు వచ్చారు. ఇన్ని సానుకూల పవనాలు కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోంది. అయితే తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. భారత రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావు కోరిక మేరకే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిని నియమించింది అని ఆరోపించడం మొదలుపెట్టింది. అంతేకాదు బిసి కార్డును తెరపైకి తీసుకువచ్చింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ వల్లే భారతీయ జనతా పార్టీ ఎదిగిందని చెబుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం విరివిగా విలేకరుల సమావేశాలు నిర్వహించారు. మూడు సంవత్సరాలలో బండి సంజయ్ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, దానిని గుర్తించలేని అధిష్టానం ఆయనను అర్ధాంతరంగా పక్కన పెట్టిందని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి ఆయనను మార్చి కిషన్ రెడ్డి నియమించడం.. బీసీ నేతల పార్టీ అని చెప్పుకునే బిజెపికి బీసీలపై ఎంత ప్రేమ ఉందో స్పష్టం చేస్తోందని వారు ధ్వజమెత్తారు.

కెసిఆర్ కోరిక మేరకే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారని.. అమిత్ షాను కలిసిన మంత్రి కేటీఆర్.. తమకు అనుకూలంగా ఉన్నవారిని అధ్యక్షుడిగా నియమించుకున్నారని ఆరోపించారు. అలాగే కిషన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంలో సీఎం కేసీఆర్ విజయవంతమయ్యారని వారు గుర్తు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి, బీఆర్ఎ స్ ఒక్కటేనని, బీసీ వ్యతిరేక పార్టీ బిజెపి అన్న ప్రచారాన్ని తెరపైకి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపగల సామాజిక వర్గం.. రెడ్డి సామాజిక వర్గం అనే సంగతి తెలిసిందే. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు, ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీకి పెరిగిన గ్రాఫ్ కారణంగా ఈ సామాజిక వర్గం క్రమంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే కిషన్ రెడ్డిని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించారని తెలుస్తోంది. మరి దీనిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటుంది అనేది తేలాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Oktelugu Epaper