HomeతెలంగాణTelangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. రేవంత్‌ గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్‌!

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. రేవంత్‌ గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్‌!

Telangana Rising Global Summit: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 8, 9వ తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనుంది. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు.
‘తెలంగాణ రైజింగ్‌’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమం పారిశ్రామిక వేత్తలు, సృజనాత్మక ఆలోచనకారులు, నిర్ణయాధికారులు, సినిమా, క్రీడలు, విద్యా రంగాల నుంచి ఎంపికైన వ్యక్తులు, విదేశీ ప్రతినిధులు, నిపుణులను ఒకే వేదికపైకి రానున్నారు. సుమారు 4,800 మందికి ఆహ్వానం పంపిన ప్రభుత్వం, ఇప్పటికే 600 కంటే ఎక్కువ మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల రాకను ధ్రువీకరించింది. మొత్తంగా 2 వేలకన్నా ఎక్కువ మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అభివృద్ధిపై చర్చ..
రెండు రోజుల సమావేశంలో రాష్ట్ర భవిష్యత్‌ అభివృద్ధి గురించి ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. అలాగే రూ. లక్షల కోట్లకు మించిన పెట్టుబడి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్‌ లక్ష్యాలు, చర్చా విషయాలు సమావేశంలో 2047 నాటికి రాష్ట్ర ఆర్థికావృద్ధిని 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చే వ్యూహాలపై పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమాలోచనలు నిర్వహిస్తారు. ప్రధాన దృష్టి కాలుష్య నియంత్రణ (నెట్‌ జీరో), సెమీకండక్టర్‌ రంగం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, నైపుణ్యాలు కలిగిన మానవ సంపద అభివృద్ధి, మహిళల ఆర్థిక సాధికారత, వ్యవసాయ ఆధారిత ఉద్యమాల ప్రోత్సాహం, క్రీడల వికాసం వంటి అంశాలపై ఉంటుంది.

సాంస్కతిక వినోద కార్యక్రమాలు
జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల హాజరు కానున్న నేపథ్యంలో అతిథులకు సౌకర్యాలు సజావుగా ఉండేలా భద్రతా చర్యలు ముమ్మరంగా అమలు చేస్తున్నారు. ఈమేరు వంద ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్‌ 8న మొదలయ్యే ఈ సమ్మిట్‌లో అతిథులను విభిన్న సాంస్కతిక మరియు కళాత్మక ప్రదర్శనలు ఆకట్టుకోనున్నాయి. ప్రముఖ స్వరకర్త కీరవాణి 90 నిమిషాల సంగీత ప్రదర్శనతో మంత్రముగ్ధులను చేయనున్నారు. దీంతోపాటు, ప్రసిద్ధ వీణా వాదకురాలు పి.జయలక్ష్మి, కళా కృష్ణ నేతృత్వంలో పేరణి నాట్యం, మాయాజాలికుడు సామల వేణు ప్రదర్శనలు ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయి. అదనంగా, తెలంగాణ సంప్రదాయాలను ప్రదర్శించే కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గుడోలు, మహిళల డప్పు, పేరణి నృత్యం వంటి కళలు అతిథులను స్వాగతిస్తాయి.

అందరికీ ఆహ్వానం..
ఈ సదస్సుకు అందరికీ ఉచిత ఆహ్వానం ఉంటుంది. డిసెంబర్‌ 10 నుంచి 13 వరకు జరిగే కార్యక్రమాలను సాధారణ ప్రజలు ఎలాంటి రుసుము లేకుండా వీక్షించవచ్చు. ఈ నాలుగు రోజులూ సంగీత ఆర్కెస్ట్రా, భవిష్యత్‌ ప్రాజెక్టులపై సమావేశాలు, వివిధ శాఖల స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. ఆసక్తికలిగినవారు సమావేశ స్థలానికి సులభంగా చేరుకోవడానికి ప్రభుత్వం ఉచిత బస్‌ సేవలను సిద్ధం చేసింది. ఇవి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు (వెళ్లేవి), సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు (తిరిగి వచ్చేవి) అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీనగర్‌ వంటి ప్రాంతాల నుంచి ఈ సేవలు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

హాజరయ్యే ప్రముఖలు..
తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు గౌతమ్‌ అదానీ (అదానీ సమూహ అధ్యక్షుడు), అనంత్‌ అంబానీ (రిలయన్స్‌ డైరెక్టర్‌), ఆనంద్‌ మహీంద్రా (మహీంద్రా సమూహ అధ్యక్షుడు), అజయ్‌ దేవగన్‌ (నటుడు) వంటి ప్రముఖులు హాజరవుతారు. ఇతరుల్లో ఎరిక్‌ స్వైడర్‌ (ట్రంప్‌ మీడియా సీఈఓ), తారిఖ్‌ అల్‌ ఖాసిమి (రస్‌ అల్‌ ఖైమా సభ్యుడు), ఆర్‌. దినేశ్‌ (టీవీఎస్‌ అధ్యక్షుడు), జి. మల్లికార్జునరావు (జీఎంఆర్‌ అధ్యక్షుడు), ఇర్ఫాన్‌ రజాక్‌ (ప్రెస్టీజ్‌ అధ్యక్షుడు), మియో ఒకా (ఏడీబీ ఇండియా డైరెక్టర్‌), కిరణ్‌ మజుందర్‌ షా (బయోకాన్‌ చైర్‌), చల్లా శ్రీనివాసులు శెట్టి (ఎస్బీఐ ఎండీ), సింధూ గంగాధరన్‌ (శాప్‌ ల్యాబ్స్‌ ఎండీ, నాస్కామ్‌ చైర్‌), కావ్య మారన్‌ (సన్రైజర్స్‌ సీఈఓ), మిలింద్‌ కాంబ్లె (డిక్కీ చైర్‌), విక్రమ్‌ తన్వార్‌ (డోమ్‌ సహ వ్యవస్థాపకుడు), రోహిత్‌ జావా (యూనిలీవర్‌), యునూ కిమ్‌ (హ్యుందయ్‌ ఎండీ), హిరోషి పురుటా (తోషిబా సేఎండీ), ఒలివియెర్‌ ఆండ్రెస్‌ (శాఫ్రాన్‌ సీఈఓ), పిరోజ్‌ గోద్రెజ్‌ (గోద్రెజ్‌ వైస్‌ చైర్‌), అరుణ్‌ మామెన్‌ (ఎంఆర్‌ఎఫ్‌ ఎండీ), ఫామ్‌ శాన్‌ చవ్‌ (విన్‌ సీఈఓ), కవితారెడ్డి (లండన్‌ యూనివర్సిటీ ఛైర్‌), సుమన్‌ కె బెరి (నీతి అయోగ్‌ వైస్‌ చైర్‌), డాక్టర్‌ జైతీర్థ ఆర్‌ జోషి (బ్రహ్మోస్‌ సీఈఓ), టోనీ బ్లెయిర్‌ (యూకే మాజీ ప్రధాని, వీడియో ద్వారా), ప్రియదర్శన్‌ (దర్శకుడు), అనిరుద్ధరాయ్‌ చౌదురి (దర్శకుడు), రిషబ్‌ శెట్టి (నటుడు), సుచత చౌంగ్‌ శ్రీ (మిస్‌ వరల్డ్‌ 2025), పీవీ సింధు (క్రీడాకారిణి), గగన్‌ నారంగ్‌ (క్రీడాకారుడు) ఉన్నారు. అలాగే, దక్షిణ కొరియా, మలేసియా, ఫిజీ, ఇరాక్, జమైకా, లిసోతో, నేపాల్, గాంబియా, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, సింగపూర్‌ వంటి దేశాల నుంచి రాయబారులు మరియు హైకమిషనర్లు పాల్గొంటారు.

సమ్మిట్‌లో చర్చా అంశాలు..
ప్రధానంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వృద్ధిని 3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చే వ్యూహాలపై దృష్టి సారిస్తుంది. ఈ సమిట్‌లో ’తెలంగాణ రైజింగ్‌–2047’ విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తూ, పారిశ్రామిక నేతలు, నిపుణులు, పాలసీ మేకర్లతో కలిసి కీలక చర్చలు జరుగుతాయి. ఈ డాక్యుమెంట్‌ 8 అధ్యాయాలు, 3 పునాది ఎనేబ్లర్ల (టెక్‌ – ఇన్నోవేషన్, ఎఫిషియెంట్‌ ఫైనాన్సింగ్, గుడ్‌ గవర్నెన్స్‌)పై ఆధారపడి ఉంటుంది. చర్చలు స్థిరమైన అభివృద్ధి, సమానత్వం, ప్రజలు–కేంద్రీకృత విధానాలపై దృష్టి పెడతాయి.

నెట్‌ జీరో లక్ష్యం..
కాలుష్య రహిత రాష్ట్రంగా మారడం, ఎనర్జీ, పరిశ్రమలు, వ్యవసాయం, అర్బన్‌ ప్లానింగ్‌లో ట్రాన్సిషన్‌లు. పర్యావరణ స్థిరత్వాన్ని ఆర్థిక ప్రगతితో సమతుల్యం చేయడం, గ్రీన్‌ ఎనర్జీ, సస్టైనబుల్‌ ప్రాక్టీస్‌లపై చర్చలు.

వ్యూహాత్మక ప్రాంతీయ ఆర్థిక ప్రణాళిక
థ్రీ–టియర్‌ స్పేషల్‌ ఫ్రేమ్‌వర్క్‌: అర్బన్‌ కోర్‌ (హై–టెక్‌ ఇన్నోవేషన్‌), పెరి–అర్బన్‌ జోన్స్‌ (ఇండస్ట్రియల్‌ హబ్‌లు), రూరల్‌ తెలంగాణ (అగ్రి–టెక్, లైవ్‌స్టాక్, ఫారెస్ట్‌ ఎకానమీలు). ఫంక్షనల్‌ స్పెషలైజేషన్, సస్టైనబిలిటీ, ఈఖ్విటబుల్‌ రీజనల్‌ గ్రోత్‌పై దృష్టి.

పెట్టుబడి ఆకర్షణ..
మాన్యుఫాక్చరింగ్, ఐటీ – ఎమర్జింగ్‌ టెక్, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీలు)లో అవకాశాలు. మల్టీనేషనల్‌ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం, బిజినెస్‌–ఫ్రెండ్లీ పాలసీలు.

కీలక స్టేక్‌హోల్డర్‌ గ్రూపుల సాధికారత..
మహిళలు, యువత, రైతుల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, నైపుణ్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఇన్‌క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌ మరియు ఈఖ్విటబుల్‌ గ్రోత్‌పై చర్చలు.

మానవ అభివృద్ధి..
ఆరోగ్యం, పోషకాహారం, విద్య, యువ శ్రేయస్సు విషయాలపై ఇంటెలెక్చువల్స్‌తో చర్చలు. హెల్త్‌ సెక్టార్‌ వ్యూహాలు, న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌లు మరియు ఎడ్యుకేషన్‌ రిఫార్మ్‌లు.

డీప్‌టెక్‌ – ఇన్నోవేటివ్‌ టెక్నాలజీలు..
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్వాంటమ్, సైబర్‌సెక్యూరిటీ, జీన్‌ టెక్, ఏరోస్పేస్‌ – డిఫెన్స్, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లు. ఎంఎంఎస్‌లు బలోపేతం, టూరిజం, మీడియా – ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రమోషన్, సెమీకండక్టర్‌ పరిశ్రమ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular