HomeతెలంగాణTelangana officer Kumar corruption case: తెలంగాణ అధికారి.. 100 కోట్ల అవినీతి.. ఇది రికార్డులకే...

Telangana officer Kumar corruption case: తెలంగాణ అధికారి.. 100 కోట్ల అవినీతి.. ఇది రికార్డులకే రికార్డు..

Telangana officer Kumar corruption case: కళ్ళు చెదిరే నగదు.. అంతకు మించిన స్థాయిలో బంగారం.. వెండి అయితే కిలోల్లో.. ప్లాట్లు లెక్కకు మిక్కిలి.. ఖరీదైన గడియారాలు అంతకుమించి.. కరెన్సీ ని లెక్కించి యంత్రాలు పనిచేయకుండా ఆగిపోయాయి. బంగారాన్ని తూకం వేస్తుంటే అధికారుల బుర్రలు బద్దలైపోయాయి. అక్రమ ఆస్తుల వివరాలను లెక్కిస్తుంటే సిబ్బందికి ఊపిరి ఆగినంత పని అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వందల కోట్ల ఆస్తులను వెనకేశాడు. అవన్నీ కూడా అక్రమంగా సంపాదించాడు. చివరికి ఏసీబీ అధికారుల తనిఖీలో దొరికిపోయాడు.

తెలంగాణ ఏసీబీ అధికారులు సికింద్రాబాద్ లో మెరుపు దాడులు మొదలుపెట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఈ తనిఖీలు మొదలయ్యాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయన నివాసం ఉంటున్న మల్లాపూర్ లోని వెంకటరమణ కాలనీలో తనిఖీలు మొదలు పెట్టిన అధికారులు 1.05 లిక్విడ్ క్యాష్ సీజ్ చేశారు. ఒక దశలో కరెన్సీ కట్టలను లెక్కించే క్రమంలో యంత్రాలు మోరాయించినట్లు తెలుస్తోంది. కేజీ బంగారు ఆభరణాలు.. ఇతర ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుమార్ పేరు మీద నిజామాబాద్ ప్రాంతంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా అనేక ఆస్తులను అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో 9 విలాసవంతమైన ప్లాట్లు ఉన్నాయి. బంగారం, భూములు, ఇతర ఆస్తులను లెక్కిస్తే.. వాటి విలువ 100 కోట్లుగా తేలింది. కుమార్ నివాసంతో పాటు.. పలుచోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే కుమార్ మీద అధికారులకు చాలా ఫిర్యాదులు అందాయి. కొద్దిరోజులుగా కుమార్ మీద ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలను రూడీ చేసుకున్నారు. అనేక ఆధారాలు సేకరించిన తర్వాత మంగళవారం మెరుపు దాడులు మొదలుపెట్టారు. ఉదయం నుంచి ఇప్పటివరకు అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు.. మెట్రో వాటర్ సప్లై బోర్డులో కుమార్ కొంతకాలంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్మును తన జేబులో వేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే కాదు.. పై స్థాయి అధికారులకు కూడా తలనొప్పిగా మారిపోయారు. దీంతో ఇన్ని రోజులకు కుమార్ అవినీతి బాగోతం బయటపడింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular