తెలంగాణSupreme Court Notices KTR: కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. గులాబీ పార్టీలో కలకలం! ఏం...

Supreme Court Notices KTR: కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. గులాబీ పార్టీలో కలకలం! ఏం జరగనుంది?

Supreme Court Notices KTR: కేటీఆర్ వెంట భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నాయకులు అమెరికా వెళ్లిపోయారు. అక్కడ నిర్వహించిన రజత వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వ్యాపారులతో.. ఇతర నిపుణులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్లు చేయాలని సూచించారు. మీరు ఎక్కడ స్థిరపడినా.. తెలంగాణ అనేది పురిటి గడ్డ అని.. ఆ విషయాన్ని మర్చిపోవద్దని కేటీఆర్ సూచించారు. దానికి అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వ్యాపారులు తమ సమ్మతం తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని.. తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తామని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇంకా విదేశాలలోనే ఉన్నారు. హీరో గానే ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.. దీంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది.

ఇటీవల కాలంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. భారత రాష్ట్ర సమితి కీలక నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా కీలక విషయాలను బయటపెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మన దేశంలో అతిపెద్ద న్యాయస్థానం తాఖీదులు జారీ చేయడంతో ఆ పార్టీలో
ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఇటీవల కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ప్రభుత్వ పెద్దలు 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఆ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదును విచారించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కేటీఆర్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తన ఫిర్యాదు పై వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. దానిని సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ దేశ సర్వోన్నత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. దీనిని జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ పిటిషన్ కు సంబంధించి సమాధానం చెప్పాలని కేటీఆర్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీంతో ఒకసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది.. వాస్తవానికి ఇటీవల కాలంలో కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఏకవాక్యంతో సంబోధిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. వివిధ అభివృద్ధి పనుల్లో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వారంలో మూడు నాలుగు పర్యాయాలు విలేకరుల సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. అయితే వీటికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నప్పటికీ.. కొంతమంది నాయకులు ఇదిగో ఇలా హయ్యర్ కోర్టుల తలుపులు తడుతున్నారు. తద్వారా దూకుడు మీద ఉన్న ప్రతిపక్ష పార్టీకి స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు? సర్వోన్నత న్యాయస్థానానికి ఎలాంటి సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

Most Popular

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Harish Rao

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
Armoor MLA

Armoor MLA: తులం బంగారం పంచాయితీ.. కాంగ్రెస్ నేతల మెడలోని బంగారం గోవిందా.. సంచలన పిలుపు

Armoor MLA: తెలంగాణ రాజకీయాలలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫునుంచి రాకేష్ రెడ్డి...
Ration Card

Ration Card: రేషన్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్

Ration Card: దేశంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్...