HomeతెలంగాణRevanth Reddy And Chandrababu: కేసీఆర్‌ సెంటిమెంట్‌ రాజకీయాలకు చెక్‌... చంద్రబాబు–రేవంత్‌ వ్యూహం!

Revanth Reddy And Chandrababu: కేసీఆర్‌ సెంటిమెంట్‌ రాజకీయాలకు చెక్‌… చంద్రబాబు–రేవంత్‌ వ్యూహం!

Revanth Reddy And Chandrababu: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. అయినా విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం (జూన్‌ 6న) సమావేశం కాబోతున్నారు. ఇందుకు తెలంగాణ ప్రగతి భవన్‌ వేదిక కానుంది. అయితే పెండింగ్‌ సమస్యల్లో చాలా వరకు క్లిష్టమైనవే. వీటికి ఒక్క సమావేశంలో పరిష్కారం దొరకడం అసాధ్యం. కాకపోతే పరిష్కారానికి రోడ్‌ మ్యాచ్‌ పడుతుందని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.

సెంటిమెంటు రాజేస్తూ పబ్బం గడిపిన కేసీఆర్‌..
ఇదిలా ఉంటే తెలంగాణకు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ విభజన సమస్యల పరిష్కారానికి ఏనాడూ కృషి చేయలేదు. కేంద్రం చొరవ చూపినా సమావేశాలకు వెళ్లలేదు. మరోవైపు ఈ సమస్యలను అడ్డు పెట్టుకుని సెంటిమెంటు రాజేయడం, పార్టీ కోసం వాడుకోవడం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అవే సమస్యలతో మరోమారు సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణపై మళ్లీ ఆంధ్రా పెత్తనం మొదలైందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు గులాబీ నేతలు.

కేసీఆర్‌ సెంటిమెంట్‌కు బ్రేక్‌..
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి–చంద్రబాబు సమావేశంలో కేసీఆర్‌ సెంటిమెంటు రాజకీయాలకు చెక్‌ పెట్టే అవకాశం కనిపిస్తోంది. సమస్యలను ముందుగా రాజకీయాల నుంచి వేరు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉన్నతాధికారులు, నిపుణులు, మేధావులతో కమిటీలు ఏర్పాటు చేసి పెండింగ్‌ సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కేసీఆర సెంటిమెంటు రాజకీయాలకు చెక్‌ పడుతుందని భావిస్తున్నారు.

రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా..
విభజన సమస్యల పరిష్కారంతో రెండు రాష్ట్రాలకు మేలు జరగాలన్న ఆలోచనలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఉన్నట్లు సమాచారం. సమస్యల పరిష్కారంతోపాటు ఇన్నాళ్లూ సమస్యల పేరు చెప్పుకుని పబ్బం గడిపిని బీఆర్‌ఎస్, వైసీపీలకు కూడా ఇకపై ఛాన్స్‌ లేకుండా చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version