Homeటాప్ స్టోరీస్Pakistani Cricketers: క్రికెట్‌ మైదానం నుంచి ఉగ్రవాద శిబిరాల వరకు.. ప్రతీ పాకిస్తానీలో విద్వేషం!

Pakistani Cricketers: క్రికెట్‌ మైదానం నుంచి ఉగ్రవాద శిబిరాల వరకు.. ప్రతీ పాకిస్తానీలో విద్వేషం!

Pakistani Cricketers: భారత్‌–పాకిస్తాన్‌.. రెండూ దాయాది దేశాలే.. ఒకే తాను ముక్కలే.. కానీ ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య శత్రుత్వం కొనసాగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వైరం ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ వైరం మరింత పెరిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌.. భారత్‌ తలుచుకుంటే చరిత్ర పటంలో మిగలదు. కానీ, అక్కడి పాలకులు, ఉగ్రవాదులు పాకిస్తానీలకు అణువనువునా విద్వేషం పెంచి పోషిస్తున్నారు. భారత వ్యతిరేకులుగా మారుస్తున్నారు. ఇందుకు తాజా నిదర్శనం ఆసియా కప్‌ 2025 సూపర్‌ 4లలో భాగంగా సెప్టెంబర్‌ 21న జరిగిన భారత్‌–పాకిస్తాన్‌ మ్యాచ్‌ క్రికెట్‌ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓపెనర్‌ సహీబ్‌జాదా ఫర్‌హాన్‌ తన 50 పరుగుల సందర్భంగా బ్యాట్‌ను తుపాకీలా పట్టుకుని కాల్చినట్లు అభినయించడం, హారిస్‌ రౌఫ్‌ ’రాఫెల్‌’ విమానం కూల్చినట్లు చేతులతో సూచించడం వంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. ఈ చర్యలు ’జెంటిల్‌మెన్స్‌ గేమ్‌’ నుంచి యుద్ధ వాతావరణంగా మార్చాయి. మ్యాచ్‌ తర్వాత భారత్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పాకిస్తాన్‌ కెప్టెన్‌తో షేక్‌ హ్యాండ్‌లు చేయకపోవడం, సిరీస్‌ గెలిస్తే పాకిస్తాన్‌ వ్యక్తి చేత అవార్డు స్వీకరించకపోవాలని నిర్ణయం తీసుకోవడం ఈ విద్వేషాన్ని మరింత ఊపందుకునేలా చేసింది.

ఉగ్రవాదులను తలపిస్తున్న పాక్‌ క్రికెటర్లు..
పాకిస్తాన్‌ క్రికెటర్లు మ్యాచ్‌లో చూపిన అభినయాలు క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ, దేశంలోని ఉగ్రవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఫర్‌హాన్‌ తన బ్యాట్‌ను ఏకే–47 తుపాకీలా పట్టుకుని భారత జట్టు దిగ్బంధనం వైపు ’కాల్చినట్లు’ చేయడం, రౌఫ్‌ ’రాఫెల్‌’ విమానం కూల్చినట్లు చేతులతో సూచించి ’6–0’ అని చూపించడం (ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ 6 భారత విమానాలను కిందపడేశామనే తప్పుడు ప్రచారానికి సూచన) వంటివి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ చర్యలు పాకిస్తాన్‌ సమాజంలోని ’ముజాహిద్‌ మెంటాలిటీ’ని మైదానంలోకి తీసుకువచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇది క్రికెట్‌ను రాజకీయ ఆయుధంగా మార్చి, భారత్‌పై విద్వేషాన్ని ప్రదర్శించడానికి ఉదాహరణగా మారింది. ఫలితంగా, భారత జట్టు పాక్‌ ఆటగాళ్లతో దూరం పాటించడం మొదలుపెట్టింది, ఇది క్రీడా భావనలకు విరుద్ధమని అంతర్జాతీయ క్రికెట్‌ సంఘాలు చర్చిస్తున్నాయి.

ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ తుక్కుతుక్కు..
మే 7 భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే) మరియు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి, 100 మంది ఉగ్రవాదులను చంపింది. ఈ దాడుల్లో జైష్‌–ఏ–మహ్మద్‌ (జెఎమ్‌) ప్రధాన కార్యాలయం బహావల్‌పూర్‌లోని మర్కజ్‌ సుభానల్లా, లష్కర్‌–ఏ–తొయిబా (ఎల్‌ఎటి) మురీద్కేలోని మర్కజ్‌ తైబా వంటి కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో జెఎమ్‌ ప్రధాని మసూద్‌ అజర్‌ కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు, అతని సోదరుడు యూసుఫ్‌ అజర్‌ (1999 కాందహార్‌ విమాన హైజాక్‌ చేసినవాడు) సహా. మసూద్‌ అజర్‌ 1999లో భారత విమానాన్ని హైజాక్‌ చేసి విడుదలైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకడు, జెఎమ్‌ను స్థాపించి పార్లమెంట్, పుల్వామా దాడులకు కారణమయ్యాడు. ఈ దాడులు పాహల్గామ్‌ టెర్రర్‌ అటాక్‌ (ఏప్రిల్‌ 22, 2025లో 26 మంది మరణాలు)కు ప్రతీకారంగా జరిగాయి. ఈ సంఘటనలు పాక్‌ ఉగ్రవాద యంత్రాంగానికి తీవ్ర దెబ్బ తీసుకొచ్చాయి.

ఉగ్రస్థావరాల తరలింపు..
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్తాన్‌–ప్రాయోజిత ఉగ్రవాద సంస్థలు పీవోకే, పంజాబ్‌ నుంచి కైబర్‌ పక్తూంఖ్వా (కేపీకే)కు తమ స్థావరాలను తరలిస్తున్నాయి. జెఎమ్, ఎల్‌ఎటి, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ (ఎచ్‌ఎమ్‌) వంటి సంస్థలు కేపీకేలోని మాన్సెహ్రా, గర్హీ హబీబుల్లా వంటి ప్రాంతాల్లో కొత్త శిబిరాలు నిర్మిస్తున్నాయి. ఈ తరలింపు భారత దాడుల నుంచి రక్షణ కోసం, అఫ్ఘనిస్తాన్‌ సరిహద్దు సమీపంలోని కఠిన భూభాగాన్ని ఉపయోగించడానికి జరుగుతోంది. సెప్టెంబర్‌ 14న మాన్సెహ్రాలో జెఎమ్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ జరగడం ఈ మార్పును స్పష్టం చేసింది. పాక్‌ ప్రభుత్వం ఈ చర్యలకు మద్దతు ఇస్తూ, ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశాలు అందిస్తోంది. ఇది భారత్‌పై తదుపరి దాడులకు తయారి చేస్తున్నట్లు తెలుస్తోంది.

బహావల్‌పూర్, మురీద్కేలో కొత్త శిబిరాలు..
ధ్వంసమైన ఉగ్రస్థావరాల పునర్నిర్మాణంపై పాకిస్తాన్‌ ఉగ్రవాద యంత్రాంగం పట్టుదలను చూపిస్తోంది. బహావల్‌పూర్‌లోని సుభానల్లా కాంప్‌ కాంప్లెక్స్‌ (సరిహద్దు నుంచి 200 కి.మీ. దూరం), మురీద్కేలోని ఎల్‌ఎటి కేంద్ర కార్యాలయాలు పాక్‌ ప్రభుత్వ సహాయంతో పునర్నిర్మిస్తున్నాయి. మురీద్కేలో ఆగస్టు 18 నుంచి డిమాలిషన్‌ పూర్తి చేసి, సెప్టెంబర్‌ 7 నాటికి పునర్నిర్మాణం ప్రారంభమైంది, 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయికి చేర్చాలని లక్ష్యం. పాక్‌ ప్రభుత్వం 4 కోట్లు మద్దతు ఇచ్చింది, ’ఫ్లడ్‌ రిలీఫ్‌’ పేరిట డబ్బులు సేకరిస్తూ ఈ పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలు ఉగ్రవాదాన్ని పునరుజ్జీవనం చేస్తూ, భారత్‌పై కొత్త ముప్పును సృష్టిస్తున్నాయి.

ఆసియా కప్‌ మ్యాచ్‌లో పాక్‌ క్రికెటర్ల ప్రవర్తన, ఉగ్రస్థావరాల తరలింపు, పునర్నిర్మాణం భారత్‌–పాకిస్తాన్‌ మధ్య విద్వేషం ద్వంద్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. క్రికెట్‌ మైదానంలో ’తుపాకీ, విమాన ధ్వంసం’ అభినయాలు ఉగ్రవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంటే, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత కేపీకేలో కొత్త శిబిరాలు భవిష్యత్‌ దాడులకు సిద్ధం కావడాన్ని సూచిస్తున్నాయి. భారత్‌ ఈ ముప్పును ఎదుర్కోవడానికి డిప్లొమసీ, సైనిక చర్యలు మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular