Miss World 2025 Hyderabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం సందడిగా మారింది, వివిధ దేశాల నుంచి అందాల పోటీదారులు ఇక్కడ దిగుతున్నారు. విదేశీ ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో ప్రత్యేక లాంజ్లు, సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: ‘కూలీ’ టీజర్: రజినీకాంత్ విజిల్ సౌండ్ పాన్ ఇండియాలో వినిపిస్తుందా..?
ఇప్పటికే సుమారు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. వారిలో మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్వాన్ రెన్స్బర్గ్ వంటి వారు ఉన్నారు. పర్యాటక శాఖ అధికారులు వీరికి విమానాశ్రయంలో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలించారు.
ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాకిస్తాన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది. మిస్ పాకిస్తాన్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ప్రపంచ సుందరీమణులతో హైదరాబాద్ కళకళలాడుతోంది, అంతర్జాతీయ స్థాయిలో నగరం ప్రతిష్టను పెంచే ఈవెంట్కు అంతా సిద్ధమైంది.