HomeతెలంగాణMinister Ponnam Prabhakar : మీడియాపై రెచ్చిపోయిన తెలంగాణ మంత్రి.. ఎవడా హౌలా గాడు అంటూ...

Minister Ponnam Prabhakar : మీడియాపై రెచ్చిపోయిన తెలంగాణ మంత్రి.. ఎవడా హౌలా గాడు అంటూ చిందులు!

Minister Ponnam Prabhakar : కరీంనగర్లో మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కులగణనపై రెండు పార్టీలు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. మైనార్టీలను బీసీలలో కొత్తగా చేర్చలేదని ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల గణన దరఖాస్తులను భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు పంపినట్టు పొన్నం వివరించారు. ” కులగణనలో ముందుగా మీరు పాల్గొనండి. ఆ తర్వాత మాట్లాడండి. బలహీన వర్గాలకు న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా” అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. మీకు చేతకాకపోతే మూసుకొని ఉండండని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనపై భారతీయ జనతా పార్టీ నాయకులకు కుట్ర చేస్తున్నారని.. వారు సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

దమ్ముంటే కులగణన చేయాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి దమ్ముంటే కేంద్రంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే విధంగా చూడాలని డిమాండ్ చేశారు..” బీసీ సమాజం బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే బాధపడింది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ నినాదం అయిపోయింది. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నది. కవితకు అప్పుడప్పుడు జాగృతి గుర్తుకొస్తుంది. అది లేకపోతే బతుకమ్మను నెత్తికి ఎత్తుకుంటుంది. ఆమె ఒక ఆడబిడ్డ.. ఆమెను విమర్శించాలని నాకు లేదు. కాకపోతే వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలే ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందువల్లే మాట్లాడాల్సి వస్తోంది.. బీసీలకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో. కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక బీసీ వ్యక్తితో భర్తీ చేసింది. ఇంకా అనేక పదవులు ఇచ్చింది. మిగతా పార్టీలు అలా చేయగలవా అంటూ” పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. అయితే ఈ సమావేశం సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఆగ్రహంగా మాట్లాడటం.. మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. గులాబి పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో తెగ సందడి చేస్తోంది. తెలంగాణ మంత్రి మీడియా ప్రతినిధులపై తొక్కుతున్న చిందులు చూడండి అంటూ భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ఈ వీడియోను తెగ ప్రచారం చేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper
Exit mobile version