Homeబిజినెస్OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ కావడానికి ఇంకా వారం రోజుల సమయం ఉంది. కానీ దీని బ్యాటరీ గురించి అప్పుడే చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది మొబైల్ యూజర్స్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. రోజూవారీ ఫోన్ వినియోగం పెరుగుతుండడంతో దీని అవసరం పెరుగుతోంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ బ్యాటరీ బ్యాకప్ ప్రత్యేకంగా కొత్త ఫోన్ ను తీసుకురాబోతుంది. మరి ఇది ఏ ఫోన్? ఇందులో ఉండే బ్యాటరీ బ్యాకప్ ఎంత?

సాధారణంగా ప్రతీ మొబైల్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. కానీ OnePlus నుంచి కొత్తగా రాబోతున్న N6x మొబైల్ లో ఊహించని బ్యాటరీని చేర్చారు. ఇందులో ఏకంగా 7000 mAh బ్యాటరీని చేర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండు రోజులకు పైగా వాడుకోవచ్చు. మార్కెటింగ్ రంగంలోని ఉద్యోగులు, నిత్యం ఫోన్ తో బిజీగా ఉండే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ట్రావెల్ చేసే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

ఈ బ్యాటరీ ఫుల్ చార్జీ అయిన తరువాత 20.56 గంటల పాటు వీడియో ప్లే బ్యాక్ ఉంటుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ కు 25.04 గంటల బ్యాకప్ ఇస్తుంది. మ్యూజిక్ ప్లే కోసం 133.56 గంటలు, వీడియో రికార్డింగ్ కోసం 11.26 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఫొటోగ్రఫీ నిరంతర కాలింగ్ కోసం యూజ్ చేసేవారికి మరింత ఎక్కువ సమయం బ్యాటరీ ఉండే అవకాశం ఉంటుంది.

ఈ ఫోన్ లో బ్యాటరీ మాత్రమే కాకుండా ఇతర ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. దీని వెనుక ప్లాట్ ప్యానెల్ డిజైన్ ఉండనుంది. ఇది పిల్ ఫేస్ కెమెరా మాడ్యుల్ ను కలిగి ఉంది. హెడ్ ఫోన్ ఉపయోగించేవారికి 3.55 ఆడియో జాక్ సదుపాయాన్ని ఇచ్చారు. వన్ ప్లస్ ఎన్ 6ఎక్స్ మొబైల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. వీటిలో ఒకటి బర్గుండీ రెడ్, ఐస్ బ్లూ.

ఈ ఫోన్ ఈనెల 31న భారత్ లో రిలీజ్ కానుంది. ఆ తరువాత దీనిని అమెజాన్, వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లలో కొనుగోలు చేయొచ్చు. రూ. 20,000 లోపు ఈ మొబైల్ ధర ఉండే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా బ్యాటరీ కోసం చూస్తారు. అలాంటి వారి కోసం ఇది మంచి ఫోన్ అని టెక్ నిపుణులు అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....
Oktelugu Epaper
Exit mobile version