MLC Kavitha: కవిత కారాగారవాసం ఇంకెన్నాళ్లు.. విముక్తి రాదా?

కోర్టు ఆదేశాలతో కవిత నాలుగు నెలలుగా తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం ఆమె ప్రత్యక కోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, దర్యాప్తు సంస్థల వాదనతో ఏకీభవించిన కోర్టులు ఆమెకు బెయిల్‌ నిరాకరించాయి.

Written By: Raj Shekar, Updated On : July 4, 2024 10:31 am

MLC Kavitha

Follow us on

MLC Kavitha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో చిక్కుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈడీ విచారణకు వెళ్లకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈడీ తన జోలికి రాదనుకుంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత మార్చి 15వ తేదీన ఈడీ డైరెక్టుగా కవిత ఇంటికే వచ్చి షాక్‌ ఇచ్చింది. ఇంట్లో సోదాలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఢిల్లీ తీసుకెళ్లి కోర్టు ఆదేశాలతో తీహార్‌ జైలుకు తరలించింది.

నాలుగు నెలలుగా జైల్లో..
కోర్టు ఆదేశాలతో కవిత నాలుగు నెలలుగా తీహార్‌ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్‌ కోసం ఆమె ప్రత్యక కోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, దర్యాప్తు సంస్థల వాదనతో ఏకీభవించిన కోర్టులు ఆమెకు బెయిల్‌ నిరాకరించాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులోనే అరెస్ట్‌ అయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లోక్‌సభ ఎన్నికల సమయంలో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఎన్నికల ప్రచారం తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు. కవితకు మాత్రం కారాగార వాసం నుంచి విముక్తి కలగడం లేదు.

బెయిల్‌ ఆశలు ఆవిరి..
ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీహార్‌ జైల్లో కవితతో ములాఖత్‌ అయ్యారు. తర్వాత మాట్లాడుతూ త్వరలోనే కవిత కేసుల నుంచి బయట పడతారని, మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌ అవుతారని ప్రకటించారు. కానీ, కవిత బెయిల్‌ ఆశలు మళ్లీ ఆవిరయ్యాయి. రెండు రోజుల క్రితం బెయిల్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు సంస్థల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్‌ నిరాకరించింది. మరోవైపు కవిత కస్టడీ ముగియడంతో వర్చువల్‌గా ఆమెను కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణ నిర్వహించిన కోర్టు కస్టడీని జూలై 25 వరక పొడిగించింది. దీంతో కవితకు నిరాశ తప్పలేదు.

కేసీఆర్‌ కుటుంబానికి అరెస్టుల భయం..
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌ కుటుంబాన్ని ఇంకోవైపు అరెస్టుల భయం వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వం ప్రాజెక్టులో అక్రమాలు, విద్యుత కొనుగోలు ఒప్పందాల్లో అవకతకవలపై రిటైర్డు జడ్జీలతో కమిషన్‌ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ఇంకోవైపు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌తోపాటు, కేటీఆర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ సంస్థలు కేసీఆర్‌ కుటుంబంలో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తాయో అనే ఆందోళన బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొంది.