HomeతెలంగాణHyderabad Food Safety Inspections: దుర్గంధం.. క్రిమీ భోజనం.. హైదరాబాద్ లో ఈ హోటళ్లలో తింటున్నారా.....

Hyderabad Food Safety Inspections: దుర్గంధం.. క్రిమీ భోజనం.. హైదరాబాద్ లో ఈ హోటళ్లలో తింటున్నారా.. ఓసారి ఈ స్టోరీ చదవండి

Hyderabad Food Safety Inspections: జొమాటో లేదా స్విగ్గి.. ఉబర్.. ఇలా ఎన్నో ఉన్నాయి. జస్ట్ ఫోన్ ఆన్ చేయడం.. యాప్ ఓపెన్ చేయడం.. ఆఫర్లు చూడడం.. నచ్చిన ఆహారం సెలెక్ట్ చేయడం.. ఆర్డర్ పెట్టడం.. పేమెంట్ ఆన్లైన్లోనే చేసేయడం.. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం డిన్నర్.. మధ్యలో స్నాక్స్.. చివరికి కేకులు.. బర్గర్లు.. పిజ్జాలు.. సూప్ లు కూడా అందులోనే.. ఆర్డర్ పెట్టిన కొత్త సమయానికి కళ్ళ ముందుకు వస్తుంది. కాళ్ల దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి తిండిని ఎవరు కాదనుకుంటారు..

కొంతకాలంగా హైదరాబాదులో సగటు నగర జీవి ఇటువంటి రెడీమేడ్ ఫుడ్ కే అలవాటు పడ్డాడు. చివరికి వివాహం జరిగిన వారు సైతం ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వండే శ్రమ లేకుండా.. చెమటలు చిందించకుండా దర్జాగా తింటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తెస్తున్న ఫుడ్ ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిస్థితుల్లో తయారుచేస్తున్నారు.. వాటి వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి ఎవరూ గుర్తించడం లేదు. చివరికి ఆఫీసర్లు చేసిన దాడుల్లో.. దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ నగరంలో ఈ నెలలో 10 రెస్టారెంట్లను అధికారులు తనిఖీలు చేస్తే.. అందులో తొమ్మిది అత్యంత దారుణంగా ఉన్నాయని తేలింది. చెత్తబుట్టలో వేయాల్సిన ఆహారాన్ని వారు విక్రయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దారుణమైన ఆహారాన్ని రకరకాల రంగులు.. మసాలాలు దట్టించి ప్లేట్లో పెడుతున్నారు.

అంతేరా.. ఈ రెస్టారెంట్ మదినగూడ లో ఉంది. ఇక్కడ కూరగాయలకు బూజు పట్టి ఉంది. వాడిన నూనె మళ్ళీ మళ్ళీ ఉపయోగించడానికి అధికారులు గుర్తించారు. పైగా ప్యాకెట్ల మీద లేబుల్స్ కూడా లేవు.

లులు హైపర్ మార్కెట్

చెత్తబుట్టలో వేయాల్సిన 150 కిలోల ఆహారాన్ని ఇక్కడ అధికారులు గుర్తించారు. వెంటనే దానిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయ్యాయి. అందులో పురుగులు ఉన్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉడిపి ఉపహార్ మూసాపేట్

డ్రైనేజీలో దారుణంగా సమస్యలు ఉన్నాయి. పురుగులు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. చెత్తబుట్టల మీద మూతలు లేవు. వంట చేసేవారు సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. లైసెన్స్ కూడా ముగిసిపోయింది.

చౌమన్, మాదాపూర్

ఇక్కడ మాంసాన్ని అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేశారు. శాకాహారం.. మాంసాహారం కలిపి నిల్వ చేశారు. కనీసం వాటి మీద మూతలు కూడా పెట్టలేదు.

జిస్మత్ జైల్ మండి, మదినగూడ

ఇక్కడ వంటలు వండే తీరు ఎలా ఉందంటే.. కనీసం వాటిని పందులు కూడా తినవు. ఐటమ్స్కు లేబుల్స్ లేవు. సరైన నిలవలేదు. దీనికి ఎటువంటి గుర్తింపు లేదు. వాతావరణం అత్యంత దారుణంగా ఉంది.

రాయల్ స్పైసి, గచ్చిబౌలి

కీటకాలు తాండవం చేస్తున్నాయి. దుర్వాసన ముక్కులను పగలగొడుతోంది. నీరు దారుణంగా నిలిచిపోయింది. కిచెన్ అత్యంత అపరిశుభ్రంగా ఉంది. వంట కాదు కదా, ఇక్కడ ఐదు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి.

సబ్ వే, కొండాపూర్

కుళ్ళిపోయిన కూరగాయలు వాడుతున్నారు. లేబుల్ లేని ఐటమ్స్ ఉపయోగిస్తున్నారు. సింక్ నిర్వహణ అత్యంత దారుణంగా ఉంది. ఆహార వృధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లాఫినోస్ పిజ్జా, జూబ్లీ ఎంక్లేవ్

బొద్దింకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇతర రెక్కల పురుగులు ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్ధాలు ఉపయోగిస్తున్నారు. అపరిశుభ్రత అత్యంత దారుణంగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version