Kishan Reddy : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడు కిషన్రెడ్డి డబుల్ ధమాకా కొట్టబోతున్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈమేరకు పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్కు సముచిత ప్రాధాన్యత ఇస్తామని అగ్ర నేతలు చెబుతున్నారు. మరోవైపు అధ్యక్షడిగా బండిని మార్చటంపై ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.