spot_img
HomeతెలంగాణCongress First List: 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా.. ఏ ఏ కులాలకు ప్రాధాన్యం...

Congress First List: 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా.. ఏ ఏ కులాలకు ప్రాధాన్యం దక్కిందంటే..

Congress First List: అనేక చర్చలు.. వరుస సమావేశాల అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఆదివారం ఉదయం విడుదల చేసింది. ఈ జాబితాలో పలు సామాజిక వర్గాలకు కీలక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్లాష్ సర్వేలలో మెరుగ్గా ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెలుపు గుర్రాలకు అవకాశాలు ఇస్తూనే, కొత్తగా చేరిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ కు టికెట్ ఓకే చేసింది. మాల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ఇచ్చింది.. ఇక ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు ఆయన సతీమణి పద్మావతికి కూడా అవకాశం ఇచ్చింది.

జాబితా ఇదే

బెల్లంపల్లి స్థానాన్ని గడ్డం వినోద్ కు కేటాయించింది. మంచిర్యాల టికెట్ ను కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఖరారు చేసింది. నిర్మల్ స్థానాన్ని కుచడి శ్రీనివాసరావు, ఆర్మూరు స్థానాన్ని ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ స్థానాన్ని సుదర్శన్ రెడ్డి, బాల్కొండ స్థానాన్ని ముత్యాల సునీల్ కుమార్, జగిత్యాల ను జీవన్ కుమార్ రెడ్డి, ధర్మపురిని అట్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం స్థానాన్ని రాజ్ ఠాకూర్, మంథని స్థానాన్ని శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి స్థానాన్ని విజయ రమణ రావుకు, వేములవాడను ఆది శ్రీనివాస్, మానకొండూరును కవంపల్లి సత్యనారాయణకు, మెదక్ ను మైనంపల్లి రోహిత్ రావుకు, ఆందోల్ స్థానాన్ని దామోదర్ రాజనర్సింహకు, జహీరాబాద్ స్థానాన్ని ఆగం చంద్రశేఖర్ కు, సంగారెడ్డి స్థానాన్ని జగ్గారెడ్డికి, గజ్వేల్ స్థానాన్ని నర్సారెడ్డికి, మేడ్చల్ ను తోటకూర వర్జస్ యాదవ్ కు, మల్కాజ్ గిరి స్థానాన్ని మైనంపల్లి హనుమంతరావుకు, కుత్బుల్లాపూర్ స్థానాన్ని కోలన్ హనుమంత్ రెడ్డికి, ఉప్పల్ స్థానాన్ని పరమేశ్వర్ రెడ్డికి, చేవెళ్ల స్థానాన్ని పమేలా భీమ్ భారత్ కు, వికారాబాద్ స్థానాన్ని గడ్డం ప్రసాద్ కు, ముషీరాబాద్ స్థానాన్ని అంజన్ కుమార్ యాదవ్ మందాడికి, మలక్ పేట్ స్థానాన్ని షేక్ అక్బర్ కు, సనత్ నగర్ స్థానాన్ని డాక్టర్ కోట నీలిమకు, నాంపల్లి స్థానాన్ని మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కు, కార్వాన్ స్థానాన్ని ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రికి, గోషా మహల్ స్థానాన్ని మొగిలి సునీతకు, యాకత్ పూర స్థానాన్ని రవి రాజుకు, బహదూర్ పూర స్థానాన్ని రాజేష్ కుమార్ పులిపాటికి, సికింద్రాబాద్ స్థానాన్ని ఆడం సంతోష్ కుమార్ కు, కొడంగల్ ను అనుముల రేవంత్ రెడ్డికి, గద్వాల స్థానాన్ని సరిత తిరుపతయ్యకు, అలంపూర్ స్థానాన్ని డాక్టర్ సంపత్ కుమార్ కు, నాగర్ కర్నూల్ స్థానాన్ని డాక్టర్ కూచాకుల్లా రాజేశ్వర్ రెడ్డికి, అచ్చంపేట స్థానాన్ని చిక్కుడు వంశీకృష్ణకు, కల్వకుర్తి స్థానాన్ని కసిరెడ్డి నారాయణరెడ్డి కి, షాద్ నగర్ స్థానాన్ని శంకరయ్యకు, కొల్లాపూర్ స్థానాన్ని జూపల్లి కృష్ణారావుకు, నాగార్జునసాగర్ స్థానాన్ని కొందూరు జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డికి, హుజూర్ నగర్ స్థానాన్ని నల్లమడ ఉత్తంకుమార్ రెడ్డికి, కోదాడ నలమాడ పద్మావతి రెడ్డి, నల్లగొండ స్థానాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ స్థానాన్ని వేముల వీరేశం, ఆలేరు స్థానాన్ని బీర్ల ఐలయ్యకు, స్టేషన్గన్పూర్ స్థానాన్ని సింగపూర్ ఇందిరకు, నర్సంపేట స్థానాన్ని దొంతి మాధవరెడ్డికి, భూపాలపల్లి స్థానాన్ని గండ్ర సత్యనారాయణ రావుకు, ములుగు స్థానాన్ని సీతక్కకు, మధిర స్థానాన్ని భట్టి విక్రమార్కకు, భద్రాచలం స్థానాన్ని పోదెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ జాబితాలో ఉత్తం కుమార్ రెడ్డికి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి టికెట్లు దక్కాయి. ఇక మైనంపల్లి హనుమంతరావు కోరిక కూడా నెరవేరింది. ఆయన కుమారుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. మొదటి జాబితాలో 12 మంది ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. 16 మంది రెడ్లకు టికెట్లు మంజూరు చేసింది. ఇక టికెట్లు కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో ప్రకటించే రోజే కాంగ్రెస్ పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా తొలి జాబితాను విడుదల చేయడం విశేషం. వెలమ సామాజిక వర్గం వారికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించింది. కొంత మంది కీలక నాయకులకు పార్టీ టికెట్లు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆ జాబితాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కూడా ఉన్నారు. మలి విడతలో వీరికి టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
Oktelugu Epaper
Exit mobile version