Chalukya history in Telangana: చాళక్యులు.. ఈ పేరు వినిపిస్తే చాలు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలో వారు నిర్మించిన కట్టడాలు గుర్తుకు వస్తాయి. దక్షిణ భారత దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ చాళక్యుల ప్రభావం తక్కువే. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు వెలికి తీసిన చారిత్రక ఆధారాలలో చాళక్యుల పాత్ర కొంతమేర మాత్రమే ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఓ ప్రాంతంలో చాళక్యుల ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వారు నిర్మించిన ఆధ్యాత్మిక ప్రాంతం.. దాని వెనుక ఉన్న వృత్తాంతం అటువంటిది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి ప్రాంతంలో అత్యంత పురాతనమైన బౌద్ధ స్తూపం ఉంది. ఇది పూర్తిగా ఎర్ర మట్టితో కనిపిస్తూ ఉంటుంది. సుదూరం నుంచి చూసినప్పటికీ ఈ స్థూపం అత్యంత భారీగా కనిపిస్తూ ఉంటుంది.. బౌద్ధ మతాన్ని ఆచరించేవారు ఇక్కడికి వస్తుంటారు. టిబెట్, థాయిలాండ్, బ్యాంకాక్ వంటి దేశాలకు సంబంధించిన బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటారు. నేలకొండపల్లి సమీపంలో ఉన్న ఈ బౌద్ధ స్థూపానికి విశేషమైన చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యంత పెద్దదైన బౌద్ధ స్తూపం. ఇక్కడ చరిత్రకారులు తవ్వకాలు జరిగినప్పుడు మూడవ శతాబ్దం నాటి నాణాలు.. నిర్మాణశైలి బయటపడ్డాయి. నాడు బౌద్ధ భిక్షువులు ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఒక చెరువును తవ్వించినట్టు నాటి ఆనవాళ్ల ద్వారా తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంది. నేలకొండపల్లి మండల కేంద్రానికి కూత వేటు దూరంగా ఉంటుంది. మొదట్లో ఈ బౌద్ధకస్తుపాన్ని విరాట రాజు గద్దె అని పిలిచేవారు. స్థానికులు ఎర్ర మట్టి దిబ్బ అనేవారు. అప్పట్లో స్థానికులు తమ ఇంటి అవసరాలకు ఎర్రమట్టిని ఈ స్థూపం నుంచి తవ్వుకుని వెళ్లేవారు. 1974లో ఆర్కియాలజీ అధికారులు ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. మళ్లీ 1984లో తవ్వకాలు జరిపారు. అప్పుడు అది బౌద్ధ స్తూపం అని తేలింది. దక్షిణ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్తూపం అని అధికారులు గుర్తించారు. ఇండికా గ్రంథంలో కూడా ఈ పట్టణ విశిష్టత గురించి చరిత్రకారులు ప్రస్తావించారు.
ఇక్కడి బౌద్ధ స్తూపం 212 అడుగుల ఎత్తులో ఉంది. 54 అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దక్కన్ ప్రాంతంలో అతి పెద్దదైన స్థూపాలలో ఇది ఒకటి. ఇది మాత్రమే కాకుండా నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంకా అనేక రకాల చిన్నచిన్న స్థూపాలు ఉన్నాయి. ఈ స్తూపాన్ని చూసేందుకు భారీగా బౌద్ధ భిక్షువులు వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే పర్యాటకులకు సాంఖ్యక తగ్గట్టుగా ఇక్కడ సదుపాయాలు లేకపోవడంతో కొంతమేర నిరాశ ఎదురవుతోంది.