spot_img
HomeతెలంగాణDelhi Liquor Scam: కవితతో కేజ్రీవాల్ ను కొట్టే బీజేపీ ప్లాన్

Delhi Liquor Scam: కవితతో కేజ్రీవాల్ ను కొట్టే బీజేపీ ప్లాన్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మళ్లీ సీబీఐ దూకుడు పెంచబోతోందా.. ఇప్పటికే ఈడీ నోటీసులకు స్పందించని నేతలపై ఇప్పుడు సీబీఐ ఫోక్‌ పెట్టాందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు తనయ ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ స్కాంలో సౌత్‌ లాబీల్లో కీలకంగా వ్యవహించారని ఈడీ, సీబీఐ చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే కవితను మూడుసార్లు విచారణ చేసింది. ఇక సీబీఐ రెండుసార్లు కవిత ఇంటికి వచ్చి విచారణ చేసింది. మరోసారి పిలుస్తామని చెప్పినా ఇప్పటి వరకు పిలవలేదు.

మళ్లీ ఇన్ని రోజులకు..
ఇక ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితకు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది. కవిత లిక్కర్‌ స్కాంలో భారీగా ఆస్తులు వెనకేశారని గతంలో సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. తర్వాత పట్టించుకోలేదు. తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ రెండూ వేర్వేరుగా కేసులు నమోదు చేసి ఈ స్కాంపై విచారణ జరుపుతున్నాయి. తనను విచారణకు పిలవొద్దని కవిత ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. నెలల తరబడి వాయిదా పడుతోంది. దీంతో కవిత రిలాక్స్‌ అవుతున్నారు.

సీబీఐ రంగంలోకి..
తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. సౌత్‌ లాబీ నుంచి దాదాపు అందరూ అరెస్ట్‌ అయ్యారు.. అప్రూవర్‌గా మారారు. కవిత మాత్రం ఇంతవరకు అరెస్ట్‌ కాలేదు.. అప్రూవర్‌ కాలేదు. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తాజాగా సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్క దెబ్బకు ఇద్దరు నేతలు..
సీబీఐ, ఈడీ నోటీసులు ఇస్తున్నా ఇటు కవిత, అటు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించడం లేదు. దీంతో ఈసారి ఇద్దరినీ ఒకేసారి టార్గెట్‌ చేయాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఢిల్లీ సీఎంపై సీబీఐ స్కాం పాలసీ మార్పు, క్విడ్‌ ప్రోకో వంటి అంశాలపై కేసు నమోదు చేసింది. ఇందులో మాగుంట రాఘవరెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. కేజ్రీవాల్‌కు, ఆమ్‌ఆద్మీ పార్టీకి డబ్బులు ఎలా ఇచ్చారు అని తెలిపారు. ఈ వ్యవహారంలో కవితే కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీంతో ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఇటు కేజ్రీవాల్, అటు కవితను విచారణ చేస్తారని తెలుస్తోంది. కవిత భుజంపై తుపాకీ పెట్టి కేజ్రీవాల్‌ను షూట్‌ చేయడమే లక్ష్యంగా తాజా నోటీసులు అని ప్రచారం జరుగుతోంది. కవిత విచారణ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంటుందని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper