Bhatti Vikramarka camp tragedy: తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు.. ఈయన మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి విక్రమార్క ముఖ్యపాత్ర పోషించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు.
ప్రస్తుతం విక్రమార్క తెలంగాణలో ఉపముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. ఆర్థిక, సింగరేణి వంటి శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన శిబిరంలో ఇటీవల చోటుచేసుకుంటున్న విషాద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. గడచిన 14 కాలంలో విక్రమార్క శిబిరంలో కీలకంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు కన్నుమూశారు. దీంతో బాధిత కుటుంబాలలో తీవ్రమైన దుఃఖం నెలకొంది. ఈ పరిణామాలతో విక్రమార్క కూడా ఆందోళనలో ఉన్నారు.
తక్కెళ్ళపల్లి శ్రీనివాస్
విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ గత ఏడాది ఫిబ్రవరి 24న గుండెపోటుతో చనిపోయారు. ఖమ్మం శివారు ప్రాంతంలోని ఏదులాపురం పురపాలకం పరిధిలో ఉన్న తన నివాసంలో శ్రీనివాస్ గుండెపోటుకు గురై చనిపోయారు. శ్రీనివాస్ చనిపోవడాన్ని విక్రమార్క జీర్ణించుకోలేకపోయారు. శ్రీనివాస్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహమ్మద్ జావిద్
ఈనెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ కన్నుమూశారు. విక్రమార్కకు జావిద్ అత్యంత సన్నిహితమైన వ్యక్తి. విక్రమార్క అత్యంత దగ్గరగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులలో జావిద్ ముందు వరుసలో ఉంటాడు. జావీద్ చనిపోవడం విక్రమార్కకు మాత్రమే కాకుండా.. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు.. ఇటీవల నిర్వహించిన సంతాప సభలో విక్రమార్క జావిద్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
మారబోయిన మధుసూదన్
శ్రీనివాస్, జావిద్ మరణాలను మర్చిపోకముందే.. విక్రమార్క శిబిరంలో అత్యంత కీలకమైన వ్యక్తి.. సిపిఆర్ఓ మారబోయిన మధుసూదన్ గుండెపోటుకు గురై చనిపోయారు. విక్రమార్కకు, మధుసూదన్ కు అందమైన సంబంధం ఉంది. గతంలో మధుసూదన్ వివిధ పత్రికలలో పనిచేస్తున్నప్పుడు విక్రమార్కకు అనుబంధం ఏర్పడింది. అది కాస్త విక్రమార్కకు సిపిఆర్వోగా ఉండే స్థాయికి ఎగిరింది. విక్రమార్కకు, మధుకు దశాబ్దల అనుబంధం ఉంది. మధుసూదన్ గుండెపోటుతో చనిపోవడం విక్రమార్కకు తీరని లోటు.
శ్రీనివాస్, జావిద్, ఇప్పుడు మధుసూదన్ చనిపోవడంతో విక్రమార్క దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని ఆయన ప్రకటించారు. కీలకమైన వ్యక్తులు నెలల వ్యవధిలోనే చనిపోవడం పట్ల విక్రమార్క ఆవేదన మామూలుగా లేదు. సంబంధిత వ్యక్తుల సంతాప సభల్లో పాల్గొన్నప్పుడు విక్రమార్క తన ఆవేదనను మాటల రూపంలో చెప్పలేకపోతున్నానని కన్నీటి పర్యంతమవుతున్నారు. విక్రమార్క శిబిరంలో ఇలా వరుసగా విషాదాలు జరగడం అటు ఆయనకు.. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి.
