Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై సొంత పార్టీలోనే కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా మూడేళ్ల పదవీకాలం పూర్తయినందున అధిష్టానం అధ్యక్షుడిని మారుస్తుందని బండి వ్యతిరేకవర్గం భావించింది. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎండికలు ఉండడం, మరోవైపు అమిత్షా అండ బండి సంజయ్కు మెండుగా ఉండడంతో బండి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈమేకు స్పష్టత కూడా ఇచ్చింది. ఈ విషయం ఆయన వ్యతిరేకవర్గానికి మింగుడు పడడం లేదు. బండి సంజయ్ సారథ్యంలో ఎన్నికలకు వెళితే.. ముఖ్యమంత్రి కూడా ఆయనే అవుతారని వ్యతిరేకవర్గం ఆలోచన దీంతో అధ్యక్షుడి మార్పునకు ఈ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో జాతీయ నాయకత్వం కూడా పునరాలోచనలో పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అంతర్గత కుమ్ములాటలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పార్టీలో మార్పులకు సంకేతాలిచ్చింది.