spot_img
HomeతెలంగాణAtrocities At Gachibowli AIG Hospital: కాలేయ మార్పిడి.. ఇల్లు అమ్మి ₹85 లక్షల బిల్లు...

Atrocities At Gachibowli AIG Hospital: కాలేయ మార్పిడి.. ఇల్లు అమ్మి ₹85 లక్షల బిల్లు కట్టినా.. డెడ్ బాడీ చేతిలో పెట్టారు….

Atrocities At Gachibowli AIG Hospital: ఠాగూర్ సినిమా చూశారా.. అందులో చనిపోయిన వ్యక్తిని ఆసుపత్రిలో జాయిన్ చేస్తాడు చిరంజీవి. డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు.. అతడు బతకాలని ఆస్పత్రి వారిని కోరతాడు. డబ్బు ఎంతైనా పెట్టే సామర్థ్యం ఉండడంతో అతని దగ్గర నుంచి అందినంత కాడికి దండుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం భావిస్తుంది. అతడికి లేనిపోని మాటలు చెప్పిస్తుంది. అంతేకాదు అతడికి వైద్యం చేయించడానికి చాలా ఖర్చవుతుందని డబ్బులు వసూలు చేస్తుంది. చివరికి వారి బండారం చిరంజీవి బయటపెడతాడు.. దీంతో ఆ ఆస్పత్రి సీజ్ అవుతుంది.

అది సినిమా కాబట్టి ఆసుపత్రి సీజ్ అవుతుంది. కానీ నిజ జీవితంలో ఇలా డబ్బులు వసూలు చేసిన ఏ ఆసుపత్రి మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు. పైగా ఆ ఆస్పత్రులకు ఉన్న మనీ పవర్ వల్ల ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. మీడియా కూడా పెద్దగా పట్టించుకోదు. కానీ నేటి కాలంలో సోషల్ మీడియా విపరీతమైన వాడకంలో ఉంది కాబట్టి ఇటువంటి విషయాలు త్వరగానే వెలుగులోకి వస్తున్నాయి.. అటువంటి దారుణమే ఇప్పుడు ఒకటి చోటుచేసుకుంది. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినప్పటికీ.. సోషల్ మీడియా దానిని వెలుగులోకి తెచ్చింది. ఆ ఆసుపత్రి బండారాన్ని బయటపెట్టింది.

హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ పేరుతో అతిపెద్ద ఆసుపత్రి ఉంది. ఇక్కడ అనేక రోగాలకు ప్రపంచ స్థాయి వైద్యం లభిస్తుంది. వైద్యులు కూడా అదే స్థాయిలో ఉంటారు కాబట్టి.. ఈ ఆసుపత్రికి భారీగా రోగులు వస్తుంటారు. ఏఐజి ఆసుపత్రికి ఉన్న పేరును దృష్టిలో పెట్టుకొని ఓ వ్యక్తి వచ్చాడు. అతని లివర్ దారుణంగా దెబ్బతిన్నది. దానిని మార్చాలని వైద్యులు చెప్పడంతో ఏఐజి ఆసుపత్రికి వచ్చాడు. కాలేయాన్ని మార్చేందుకు దాదాపు 85 లక్షల వరకు బిల్ అవుతుందని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు పూర్తిగా డబ్బు చెల్లించారు. అయితే అతని బతికించుకోవడానికి ఇల్లును కూడా విక్రయించారు. అలా విక్రయించగా వచ్చిన డబ్బును ఆసుపత్రికి చెల్లించారు. కాలేయం మార్చి అతడిని బతికించాల్సిన ఆసుపత్రి వైద్యులు.. అతడికి మరణ శాసనాన్ని రాశారు. దీంతో అతడు లివర్ మార్పిడి జరగకుండానే కన్నుమూశాడు. పైగా ఆ వ్యక్తి గడిచిన రెండు రోజుల క్రితమే కన్నుమూశాడు.

పూర్తిస్థాయిలో డబ్బులు రాబట్టుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యం అతడి మరణాన్ని దాచి పెట్టింది.. ₹85 లక్షల బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత .. అతడి శవాన్ని వారి చేతుల్లో పెట్టింది. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంత జరిగినప్పటికీ ఏ మీడియా సంస్థ కూడా దీనిని వార్తలాగా ప్రసారం చేయలేదు. సోషల్ మీడియా వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper