Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు అంత ఈజీకాదు..ప్రత్యర్థులు ఎవరో తెలుసా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు ఎంతో కొంత పోటీనిచ్చే క్యాండిడేట్ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్. ఈయన తీన్మార్ మల్లన్న లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టి పోరాటాలే చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూతురు కవిత అక్రమాస్తులకు సంబంధించిన వివరాలను బయటపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 12:04 pm

Teenmar Mallanna

Follow us on

Teenmar Mallanna: వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తీన్మార్ మల్లన్నకు అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన ఆయన తన ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొనున్నారు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి,కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్,నిరుద్యోగుల్లో విశేష ఆదరణ ఉన్న అశోక్ సార్ ల నుంచి తీన్మార్ మల్లన్నకు టఫ్ కాంపిటీషన్ ఉండనుంది. బిజెపి నుంచి బిఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. ఆయన బిట్స్ ఫీలాని విద్యార్థి. రాకేష్ రెడ్డి బిజెపి నుంచి బీఆర్ఎస్ లో చేరినప్పటికీ..ఆయనకు ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్లో సానుకూల అభిప్రాయమే ఉంది. దీంతోపాటు ఇటు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరిస్తే రాకేష్ రెడ్డి గట్టి పోటీనే ఇవ్వనున్నారు. మల్లన్నకు పోలయ్యే చాలా ఓట్లను రాకేష్ రెడ్డి చీల్చేసే అవకాశముంది.

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు ఎంతో కొంత పోటీనిచ్చే క్యాండిడేట్ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్. ఈయన తీన్మార్ మల్లన్న లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టి పోరాటాలే చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూతురు కవిత అక్రమాస్తులకు సంబంధించిన వివరాలను బయటపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో వెనుకాడ లేదు. ఈ నేపథ్యంలోనే ఈయనకు యువత,పట్టభద్రుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈయన కూడా ఈసారి గట్టి పోటీనే ఇవ్వనున్నారు. ఈయన కూడా మల్లనకు పోలయ్యే ఓట్లలో మెజార్టీ ఓట్లను చీల్చుకుంటారని అభిప్రాయం ఉంది.

పట్టబదులే ఎమ్మెల్సీ బరిలో ఉన్న మరొక కీలక అభ్యర్థి అశోక్ సార్. ఈయన అశోక్ అకాడమీ పేరుతో ఎంతోమంది నిరుద్యోగస్తులకు సుపరిచితుడు. 46 జీవో పై తనదైన శైలిలో కార్యక్రమాలు కూడా చేపట్టారు. దీంతో పట్టభద్రులు,నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల్లో ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈసారి వరంగల్,కరీంనగర్,ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్ గట్టిపొటినే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా రాకేష్ రెడ్డి,బక్క జడ్సన్,అశోక్ సార్ ల రూపంలో తీన్మార్ మల్లన్నకు ప్రమాదం పొంచి ఉన్నట్లే అనిపిస్తుంది.

అంతేకాక తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్లోని కొందరు కీలక నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. బయటకు చెప్పలేకున్నా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి మల్లన్న అభ్యర్థిత్వంపై గుస్సాగా ఉన్నారు . వీరితోపాటు మరికొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వంపై అంతర్గతంగా అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న గెలుపు అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదని తేలిపోయింది.