spot_img
HomeతెలంగాణFarmer Politics: ఫార్మర్‌ పాలిటిక్స్‌.. సర్కార్‌ సైడ్‌ అవుతుందా?

Farmer Politics: ఫార్మర్‌ పాలిటిక్స్‌.. సర్కార్‌ సైడ్‌ అవుతుందా?

Farmer Politics: పార్లమెంటు ఎన్నికల ముందు.. తెలంగాణలో ఫార్మర్‌ పాలిటిక్స్‌కు అన్ని పార్టీలు తెరలేపాయి. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లు గెలవాలని అధికార కాంగ్రెస్‌ భావిస్తోంది. సర్వే సంస్థలు కూడా ఈమేరకు అంచనా వేశాయి. అయితే సీఎం రేవంత్‌ మాత్రం 14 స్థానాలు మావే అంటున్నారు. ఈ తరుణంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఫార్మర్‌ పాలిటిక్స్‌కు తెర తీశాయి. తెలంగాణలో ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి. జలాశయాలు అండుగంటుతున్నాయి. తాగునీరు కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఈ అంశాలతోనే కేసీఆర్‌ రాజకీయం మొదలు పెట్టారు.

కృష్ణా జలాల రాజకీయం ఫెయిల్‌..
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడంతో దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కేసీఆర్‌ భావించారు. కానీ, కాళేశ్వరం కుంగిపోవడం, దక్షిణ తెలంగాణను పట్టించుకోకపోవడం అంశాలతో కేసీఆర్‌ ఆశించిన ఫలితం రాలేదు. అది కాంగ్రెస్‌కే ప్లస్‌ అయింది. బీఆర్‌ఎస్‌ ఫెయిల్‌ అయింది. దీంతో కేసీఆర్‌ ఒకే సభ పెట్టి సైలెంట్‌ అయ్యాడు. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చావో రేవో అన్నట్లుగా మారాయి. ఒక్క సీటుఅయినా గెలుస్తుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మళ్లీ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీ నుంచి సీనియర్‌ నాయకులు కేకే, కడియం లాంటి వాళ్లు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో క్యాడర్‌లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేసీఆర్‌ బయటకు వచ్చారు.

ఫార్మర్‌ ఫార్ములాతో..
బయటకు రావడానికి కేసీఆర్‌ ఫార్మర్‌ ఫార్ములాను ఎత్తుకున్నారు. దానిని అమలు చేయడంలో భాగంగా రైతు పరామర్శ యాత్ర మొదలు పెట్టారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో పర్యటించారు. వారం తర్వాత కరీంనగర్‌లో పర్యటించాలని భావిస్తున్నారు. అక్కడ కూడా రైతులను పరామర్శించేల ప్లాన్‌ రెడీ చేసుకున్నారు.

‘బండి’ అలర్ట్‌..
ఈ తరుణంలో కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ అలర్ట్‌ అయ్యారు. కేసీఆర్‌ రైతుల అజెండాతో కరీంనగర్‌కు వస్తే తాను వెనుకబడి పోతానని భావించిన బండి కూడా అదే రైతు ఎజెండాతో దీక్షకు దిగాలని నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కలెక్టరేట్‌ ఎదుట దీక్షకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తన ఇంటి వద్దనే దీక్షకు సిద్ధమవుతున్నారు.

బీఆర్‌ఎస్, బీజేపీలు రైతుల పేరుతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్‌ సైలెంట్‌గా ఉండటంపై ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. కేసీఆర్‌ వాగ్ధాటికి, బండి సంజయ్‌ అటాకింగ్‌కు తగ్గట్లుగా కాంగ్రెస్‌ నుంచి కౌంటర్‌ పడలేదు. ఇదే కొనసాగితే కాంగ్రెస్‌ సైడ్‌ అవడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version