హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రీజైక్లింగ్ ప్లాంటుఫై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ప్రశంసలు కురిపించారు. మనం పారవేసే చెత్తను రీసైక్లింగ్ చేయడం మంచి కాన్సెప్ట్ అని కొనియాడారు. నగరంలోని జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంటును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్భీనరగ్ ఫతుల్ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంటును ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్లో రోజుకు 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని, అలాంటి వాటిని రీసైక్లింగ్ చేయడం అద్భుతమైన ప్రక్రియ అన్నారు. మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో జీహెచ్ఎంసీ పనితీరు మెరుగ్గా ఉందన్నారు. వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు.