వీడిన వనపర్తి యువతి హత్య కేసు మిస్టరీ

వనపర్తి జిల్లాలో సంచలనం రేపిన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. మృతురాలి కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు వెల్లడించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ఖానాపూర్ కు చెందిన యువతి హైదరాబాద్ లో ఓ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూర్ మెడికల్ షాపులో పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు 2012 నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి ప్రవర్తన తీరులో అనుమానం రావడంతో సదరు యువకుడు […]

Written By: Suresh, Updated On : November 15, 2020 1:19 pm

murderd

Follow us on

వనపర్తి జిల్లాలో సంచలనం రేపిన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. మృతురాలి కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు వెల్లడించారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం ఖానాపూర్ కు చెందిన యువతి హైదరాబాద్ లో ఓ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆత్మకూర్ మెడికల్ షాపులో పనిచేస్తున్న యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు 2012 నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి ప్రవర్తన తీరులో అనుమానం రావడంతో సదరు యువకుడు ఆమెకు దూరంగా ఉండి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన ప్రియురాలు యువకుడిని నిలదీయడంతో ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఓరోజు ప్రియుడిని నమ్మేసిన యువతి హైదరాబాద్ నుంచి సొంతూరుకు బయలుదేరింది. అయితే ఆమెను జడ్చర్ల వద్ద బైక్ పై ఎక్కించుకుని కొత్తకోట సమీపంలోని అమరచింత వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  ఈనెల 11న  పొలంలోకి వెళ్లిన రైతుకు యువతి మృతదేహం కనిపించగానే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్పటి నుంచి విచారణ చేపట్టిన పోలీసులు శ్వేత ఫోన్లోని నెంబర్ల ఆధారంగా విచారణ చేపట్టడంతో  ప్రియుడే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్దారణ అయిందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించారు.