Homeఆంధ్రప్రదేశ్‌Rajamndri : పిల్లలు లేక చాలామంది బాధపడుతుంటే.. ఒళ్ళు కొవ్వెక్కి వీళ్లు చేసిన పని ఎంతటి...

Rajamndri : పిల్లలు లేక చాలామంది బాధపడుతుంటే.. ఒళ్ళు కొవ్వెక్కి వీళ్లు చేసిన పని ఎంతటి దారుణానికి దారి తీసిందంటే..

లక్షలకు లక్షలు ఖర్చుపెట్టినా పిల్లలు కలగపోవడంతో పెళ్లయిన దంపతులు నరకం చూస్తున్నారు. ఇక పిల్లలు లేకుంటే ఈ సమాజం ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలియనిది కాదు. కొన్ని ప్రాంతాలలో పిల్లలు లేని దంపతులను పేరంటాలకు, ఇతర వేడుకలకు ఆహ్వానించరు. ఇది ఒక రకంగా ఆ దంపతులకు ఇబ్బందికర పరిణామం. అటు పిల్లలు లేక.. ఇటు సమాజం నుంచి చీత్కారం తట్టుకోలేక ఆ దంపతులు పడే వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట కొందరు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పుట్టిన పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తున్నారు. లేదా కంపచెట్లల్లో పడేస్తున్నారు. పిల్లలు లేక కొంతమంది బాధపడుతుంటే.. పిల్లల్ని కానీ కొంతమంది అర్ధాంతరంగా రోడ్డుమీద పడేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని తుమ్మల వీధిలో జరిగింది.. ఈ ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఆవరణలో ఉంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు.. అయితే ఆ శిశువు అప్పటికే చనిపోయాడు. అయితే ఆ ఇంటి యజమాని ఆ పసి గుడ్డును చూసి రైతు బజార్ పక్కన ఉన్న శతక పడేసినట్టు తెలుస్తోంది.

తుమ్మ లోవ మూడవ అడ్డవీధి లో..

ఈ సంఘటన తుమ్మలోవ మూడవ అడ్డవీధిలో జరిగింది. చనిపోయిన ఆ పసి గుడ్డును కుక్కలు పీక్కుతింటున్నాయి. దీనిని గమనించిన రైతు బజార్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ పసి గుడ్డును చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజమండ్రి మూడో నగర పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సిసి ఫుటేజ్ పరిశీలించగా.. అప్పుడే పుట్టిన పసి గుడ్డును తీసుకొచ్చి ఈ ఇంట్లో వదిలినట్టు పోలీసులు చెబుతున్నారు..”పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. సంతానం కలిగే భాగ్యం లేకపోవడంతో ఇతరుల పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. కొంతమంది ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనుల వల్ల పిల్లలు పుడితే.. వారిని ఇలా వదిలేస్తున్నారు. ఇలాంటి వారిపై ఏమాత్రం జాలి చూపించకూడదు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ పసి గుడ్డు ను కన్నతల్లి అలా కర్కషంగా ఎలా ఉంటుంది? మరీ ఇంత దారుణమా? మానవత్వం చచ్చిపోతున్నది. మనిషి అనేవాడు మూర్ఖుడిలాగా మారిపోతున్నాడు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత.. అలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులపై కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని” స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే సిసి ఫుటేజ్ లో ఆ శిశువును అక్కడ వదిలి వెళ్లిన వారిని పోలీసులు గుర్తించారని.. వారి జాడ కోసం గాలింపు మొదలు పెట్టారని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
Oktelugu Epaper
Exit mobile version