
నేడు భారత్ బయోటెక్ ను 80 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు సందర్శించనున్నారు. కోవిడ్ మీద పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేయాలన్న లక్ష్యంతో వారిని మన విదేశాంగ శాఖ ఆహ్వానించింది. ఉదయం పదింటికి హైదరాబాద్ చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం. నేరుగా ఎయిర్ పోర్ట్ నుండి ఓఆర్ఆర్ మీదుగా భారత్ బయోటిక్ కు వెళ్లనుంది. భారత్ బయోటిక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్లో ఉంది.