యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని సీపీఎం, బీజేపీ నేతలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. భువనగిరి పట్టణంలో ఐబీ కార్యాలయం ఆవరణలో వీధి వ్యాపారస్తుల కోసం నిర్మించిన దుకానాలను మంత్రి ప్రారంభిస్తుండగా ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకొచ్చారు. అయితే పోలీసులు వారిని నిలువరించారు.